lockdown: పాలట్యాంకర్లో విద్యార్థులు, తనిఖీ చేయడంతో దొరికిపోయి తిరుగుపయనం..
కరోనా వైరస్ పాజిటివ్ కేసుల నేపథ్యంలో దేశవ్యాప్తంగా లాక్డౌన్ కొనసాగుతోంది. సరిహద్దుల గుండా పాలు, కూరగాయాలు, నిత్యావసర సరుకులను మాత్రమే అనుమతిస్తున్నారు. అయితే లాక్డౌన్ పొడిగించడంతో ఎలాగైనా ఇంటికి వెళ్లాలనుకునేవారు అక్రమ మార్గాలను అనుసరిస్తున్నారు. మిర్యాలగూడ వరకు ఎలాగోలా వచ్చిన ముగ్గురు విద్యార్థులు.. తర్వాత పాల ట్యాంకర్ ఎక్కారు. కానీ పోలీసులు తనిఖీ చేయడంతో అడ్డంగా దొరికిపోయారు.
పాలట్యాంకర్ సరిహద్దు చెక్ పోస్ట్ దాటి వెళుతోంది. పొందుగుల వద్ద పోలీసులు తనిఖీలు చేపట్టారు. పాల ట్యాంకర్ ఓపెన్ చేసి.. చూడగా ముగ్గురు విద్యార్థులు కనిపించారు. వారిని వివరాలు తెలుసుకోగా.. తమది ఏపీ అని మిర్యాలగూడ వరకు కాలినడకన వచ్చామని చెప్పారు. అక్కడే పాల ట్యాంకర్ ఎక్కామని పేర్కొన్నారు.

Recommended Video
విద్యార్థుల స్వస్థలం ప్రకాశం జిల్లా సింగరాయకొండ అని తెలిసింది. హైదరాబాద్లో ఉంటున్న వీరు.. ఇంటికి వద్దామనుకొన్నారు. అలా బయల్దేరి రాగా.. మిర్యాలగూడ వద్ద పాల ట్యాంకర్ డ్రైవర్తో మాట్లాడారు. ముందుగానే డ్రైవర్కు నగదు అందజేసి.. అందులో కూర్చొన్నారు. ముగ్గురు విద్యార్థులను తిరిగి హైదరాబాద్ పంపించివేశారు. పాల ట్యాంకర్ డ్రైవర్పై కేసు నమోదు చేశారు. ట్యాంకర్ సీజ్ కూడా చేశారు. అక్రమ మార్గంలో ఎవరూ రావొద్దని పోలీసులు సూచిస్తున్నారు.
-
T20 WC 2026 ఫైనల్ గెలిచేది ఆ జట్టే: మహమ్మద్ అమీర్ -
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
రైతు భరోసా నిధులు జమ విషయంలో లేటెస్ట్ అప్డేట్! -
మిథునరాశిలో బృహస్పతి ప్రత్యక్ష సంచారం.. ఈ రాశులవారు నక్కతోక తొక్కుతున్నారు! -
బెంగళూరుకు ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
ఉగాది నుంచి మకర రాశి, ధనుస్సు రాశి వారి జాతక ఫలం -
టాలీవుడ్ స్టార్ హీరో ఎంగేజ్మెంట్ -
రైతులకు శుభవార్త.. ఆ డబ్బులు నేరుగా మీ బ్యాంకు ఖాతాల్లోనే! -
today rashiphalalu:కుంభరాశిలో ముఖ్య గ్రహాలతో వీరింట సంపదల పంట! -
నరేంద్ర మోదీ స్టేడియంలో లక్కీ లెగ్ ల్యాండ్- లెక్క సరిపోయింది -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు -
26 ఏళ్లుగా వెంకటేష్ రికార్డును బద్ధలు కొట్టలేకపోతున్న తెలుగు స్టార్ హీరోలు












Click it and Unblock the Notifications