తిరుమలలో హోటళ్ల బంద్, భక్తుల ఇబ్బందులు- ఆ ఒక్కటే ఆధారం..!!
Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. వరుస సెలవుల వేళ పెద్ద సంఖ్యలో భక్తులు కొండకు తరలి వచ్చారు. శ్రీరామ నవమి ఆస్థానం వేళ శ్రీవారి దర్శానానికి భారీగా భక్తులు తిరుమల కు వస్తున్నారు. ఇక, ఇదే సమయంలో తిరుమలలో గ్యాస్ కొరతతో పలు హోటల్స్ మూతబడటం తో భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. దీంతో, టీటీడీ అందించే అన్నప్రసాదాల పైన పెద్ద సంఖ్యలో భక్తులు ఆధార పడాల్సి వస్తోంది. టీటీడీ సైతం భక్తుల రద్దీని గుర్తించి.. అన్నప్రసాదాల తయారీ పెంచింది. భక్తులకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటోంది.
తిరుమలలోని హోటల్స్ కు వంట గ్యాస్ కష్టాలు మొదలయ్యాయి. దీంతో, నిత్యం వేలాది మంది తో రద్దీగా ఉండే తిరుమలలో ఇప్పుడు కొత్త సమస్య మొదలైంది. ఫలితంగా తిరుమలలోని మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ నిత్యాన్నప్రసాద భవనానికి భక్తుల తాకిడి క్రమంగా పెరుగుతోంది. పశ్చిమాసియా యుద్ధం నేపథ్యంలో గ్యాస్ కొరతతో తిరుమల కొండపై హోటళ్లు ఒక్కొక్కటిగా మూతపడుతున్నాయి. ఇప్పటికే 50కిపైగా హోటళ్లు మూతపడటంతో టీటీడీ ఉచితంగా అందజేసే అన్నప్రసాదాలపై భక్తులు ఆధారపడుతున్నారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు స్వామి ప్రసాదాన్ని ఒక పూట స్వీకరించి, మరో రెండుమూడు పూట్ల హోటళ్లకు వెళ్లేవారు. ఇప్పుడు యుద్ధం వల్ల గ్యాస్ కొరతతో చేసేదేమీ లేక హోటళ్లను మూసివేస్తున్నారు. మరికొందరు ఎక్కువ సమయం ఉడికే ఆహారాలు వండటం మానేశారు. ఇంకొందరు కట్టెలపొయ్యిలపై ఆధారపడుతున్నారు.

టీటీడీ అన్నదాన ప్రసాదాల పై పెరుగుతున్న ఒత్తిడి
హోటళ్లు అధికంగా మూతపడటంతో శ్రీవారి దర్శనం కోసం వచ్చే భక్తులు తిరుమలలోని వెంగమాంబ అన్నప్రసాద భవనంపైనే ఆధారపడు తున్నారు. ఫిబ్రవరి నెలలో 7వ తేదీ నుంచి 23వ తేదీ వరకు దాదాపు 12.80 లక్షల మంది అన్నప్రసాదాలు స్వీకరించగా, ఈనెల 7 నుంచి 23వ తేదీ వరకు దాదాపు 13.80 లక్షల మంది అన్నప్రసాదాలు తిన్నారు. అంటే గత నెల కంటే దాదాపు లక్ష మంది అధికంగా అన్నప్రసాద భవనాన్ని సందర్శించి భోజనాలు స్వీకరించారు. తిరుమలలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న ఫుడ్ కౌంటర్లు, క్యూలైన్లు, కంపార్టుమెంట్లు, యాత్రికులు వసతి సముదాయాల్లోనూ టీటీడీ ఉచిత అన్నప్రసాదాలకు భక్తుల తాకిడి పెరిగింది. గ్యాస్ సరఫరాలో ఇబ్బందులు తొలగకపోతే మరికొన్ని మూతపడే వీలుంది. దీంతో టీటీడీ అన్నప్రసాద విభాగంపై ఒత్తిడి పెరగనుంది. టీటీడీ రోజుకు ఐదున్నర నుంచి ఆరు టన్నుల గ్యాస్ను అన్నప్రసాదాల తయారీకి వినియోగిస్తోంది. టీటీడీ ప్రత్యేక విజ్ఞప్తి మేరకు ఐఓసీఎల్ నుంచి ఆంక్షలు లేకుండా ప్రస్తుతం గ్యాస్ సరఫరా జరుగుతోంది.
-
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
రూ.300 టికెట్లు లేకపోయినా శ్రీవారి దర్శనం- భక్తుల కోసం టీటీడీ కొత్త విధానం...!! -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్













Click it and Unblock the Notifications