పుట్టినరోజును ఘనంగా జరుపుకున్న ఆధ్యాత్మిక నగరం తిరుపతి; జన్మదినం సీక్రెట్ ఇదే!!
మనుషులకు పుట్టినరోజు వేడుకలు నిర్వహించడం తెలుసు కానీ, ఒక ప్రాంతానికి పుట్టినరోజు వేడుకలు నిర్వహించడం ఎక్కడైనా చూశారా? అలా చూడాలంటే తిరుపతి నగరానికి రావాల్సిందే. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామి పాదాల చెంత తిరుపతి 894 వ జన్మదిన వేడుకలు అత్యంత ఘనంగా జరిగాయి. టిటిడి చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఆధ్యాత్మిక నగరమైన తిరుపతి జన్మదిన వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించారు.
1130 ఫిబ్రవరి 24వ తేదీన శ్రీ రామానుజాచార్యులవారు చిన్న అగ్రహారంగా ఉన్న ఈ ప్రాంతానికి తిరుపతిగా పేరుపెట్టి గోవిందరాజస్వామి ఆలయానికి శంకుస్థాపన చేసినట్టు పురాణాలు చెబుతున్నాయి. ఈ క్రమంలోనే గత మూడేళ్లుగా తిరుపతి పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ రోజు తిరుపతిలో కన్నుల పండుగగా జరిగిన వేడుకల విశేషాలు అన్నీ ఇన్నీ కావు. తిరుపతి జన్మదినం సందర్భంగా గోవిందరాజ స్వామి ఆలయ మాడవీధుల్లో అత్యంత వైభవోపేతంగా శోభాయాత్ర నిర్వహించారు.

శ్రీవారి పూజా కైంకార్యాలను నిర్దేశించిన జగద్గురు శ్రీ రామానుజాచార్యులే స్వయంగా శంకుస్థాపన చేసిన ఒక నాటి బ్రాహ్మణ అగ్రహారమైన నేటి తిరుపతి... పరపతి మరింత పెరిగేలా టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర రెడ్డి ఆధ్వర్యంలో ఈ జన్మదిన వేడుక ఘనంగా కొనసాగింది. తిరుపతి పుట్టినరోజు సందర్భంగా శ్రీ గోవిందరాజస్వామి ఆలయం వద్ద అర్చకులు, జీయర్ స్వాముల ఆశీస్సులు తీసుకుని శోభాయాత్రను టిటిడి చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ప్రారంభించారు.
ఆద్యంతం కన్నుల పండుగగా సాగిన శోభాయాత్రలో వేద పండితుల మంత్రోచ్ఛారణలు, మంగళ వాయిద్యాలు, భజన మండళ్ళ కళా ప్రదర్శనలు కట్టి పడేశాయి. చెక్క భజనలు చేస్తూ, కోలాటాలతో నిర్వహించిన కళా ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. పౌరాణిక వేషధారణలతో నగరవాసులను ఆకట్టుకున్నారు. టీటీడీ హిందూ ధర్మప్రచార పరిషత్ ఆధ్వర్యంలో కళాకారులు అనేక కార్యక్రమాలను నిర్వహించారు.

కనుల పండగలా కొనసాగిన ఆధ్యాత్మిక తిరుపతి శోభాయాత్ర ఆద్యంతం..గోవింద నామ స్మరణలతో మారుమోగింది. ప్రతి ఒక్కరూ తిరుపతి పట్ల, సమతామూర్తి రామానుజాచార్యుల పట్ల తమ భక్తి ప్రపత్తులు ప్రదర్శించారు. తిరుపతి జన్మదినం రోజున తిరుపతి నగరం పులకించిపోయింది. అడుగడుగునా భక్తుల నీరాజనాలు.. జయజయ ధ్వానాలతో ఆధ్యాత్మిక నగరం తిరుపతి శోభాయమానంగా దర్శనమిచ్చింది. తిరుపతి ప్రజలందరూ శోభాయాత్ర కు స్వాగతం పలికారు.
ప్రతి ఇంటికి పచ్చ తోరణాలు కట్టి, పసుపు నీళ్లు గుమ్మరించి, పువ్వులతో రామానుజాచార్యుల శోభాయాత్రకు స్వాగతం పలికారు. కర్పూర హారతులు పడుతూ భక్తి వ్యక్తం చేశారు. గుమ్మడికాయలతో దిష్టి తీశారు. జగద్గురు శ్రీ రామానుజాచార్యుల వారి చిత్రపటాలను ప్రదర్శించి తిరుపతి పుట్టుకను గుర్తు చేశారు. తిరుపతి ప్రజలంతా సమతా స్ఫూర్తి గొప్పతనాన్ని చాటుతూ ముందుకు సాగారు. పుణ్యక్షేత్రమైన తిరుపతి జన్మదినం ప్రతి సంవత్సరం ఘనంగా కొనసాగాలని జీయర్ స్వాములు ఆకాంక్షించారు.
-
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
‘బాహుబలి2’, ‘పుష్ప2’లో నిజమైన ఇండస్ట్రీ హిట్ ఏది? -
కాచిగూడ మీదుగా తిరుపతికి వెళ్లే మరో ప్రత్యేక రైలు.. ఇకపై: ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్












Click it and Unblock the Notifications