వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బాబు, మంత్రులకు జగ్గీ‌వాసుదేవ్ యోగా(పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: సమస్యలను సమర్థంగా ఎదుర్కొనేందుకు యోగా చక్కని మార్గమని ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పేర్కొన్నారు. ఈషా ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో మాదాపూర్‌లోని సైబర్‌ కన్వెన్షన్‌ సెంటర్‌లో మూడు రోజులపాటు నిర్వహించే యోగా వర్క్‌షాపును గురువారం చంద్రబాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా
మానసిక ఒత్తిళ్లు, ఉద్వేగాల వల్ల ఏకాగ్రత దెబ్బతింటుందని, రక్తపోటు, మధుమేహ వ్యాధుల బారినపడుతామన్నారు.

ప్రతి వ్యక్తి తమ అంతర్గత సామర్ధ్యాన్ని పెంపొందించుకునేందుకు యోగ, ధ్యానం అవసరమని ఆయన అన్నారు. సంక్షోభాలు ఎదురైన సమయంలో సముచిత నిర్ణయాలు తీసుకోవడం, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడం, సత్వర నిర్ణయాలు తీసుకోవడం, నాయకత్వ లక్షణాలు పెంపొందించేందుకు ధ్యానం చేయాలన్నారు. ప్రజాసేవలో మమేకమైన వారికి ఒత్తిళ్లు ఎక్కువవుతున్నాయన్నారు. జీవన ప్రమాణాలు పెరిగేందుకు సైన్స్ టెక్నాలజీ ఎంత అవసరమో, అంతరంగికంగా నిశ్చలత సాధనకు ధ్యానం చేయాలన్నారు.

ఈశా ఫౌండేషన్ వ్యవస్ధాపకుడు ఆచార్య జగ్గీ వాసుదేవ్ మాట్లాడుతూ మనం ఎదుర్కొంటున్న సమస్యల గురించి కాకుండా మన ముందున్న సవాళ్ల గురించి ఆలోచించి పరిష్కరించాలన్నారు. ధ్యానం, యోగ నిత్య జీవతంలో ఎదురయ్యే సమస్యలకు సరైన దారిని చూపిస్తాయన్నారు. ప్రాచీన చరిత్రలో జనకమహారాజుకు అష్టచక్ర అనే మహర్షి చేసిన ఉపదేశంలోని అంశాలను ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు.

యోగా క్లాసులు

యోగా క్లాసులు

సమస్యలను సమర్థంగా ఎదుర్కొనేందుకు యోగా చక్కని మార్గమని ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పేర్కొన్నారు.

యోగా క్లాసులు

యోగా క్లాసులు

ఈషా ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో మాదాపూర్‌లోని సైబర్‌ కన్వెన్షన్‌ సెంటర్‌లో మూడు రోజులపాటు నిర్వహించే యోగా వర్క్‌షాపును గురువారం చంద్రబాబు ప్రారంభించారు.

యోగా క్లాసులు

యోగా క్లాసులు

ఈ సందర్భంగా మానసిక ఒత్తిళ్లు, ఉద్వేగాల వల్ల ఏకాగ్రత దెబ్బతింటుందని, రక్తపోటు, మధుమేహ వ్యాధుల బారినపడుతామన్నారు.

యోగా క్లాసులు

యోగా క్లాసులు

ప్రతి వ్యక్తి తమ అంతర్గత సామర్ధ్యాన్ని పెంపొందించుకునేందుకు యోగ, ధ్యానం అవసరమని ఆయన అన్నారు.

యోగా క్లాసులు

యోగా క్లాసులు

సంక్షోభాలు ఎదురైన సమయంలో సముచిత నిర్ణయాలు తీసుకోవడం, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడం, సత్వర నిర్ణయాలు తీసుకోవడం, నాయకత్వ లక్షణాలు పెంపొందించేందుకు ధ్యానం చేయాలన్నారు.

యోగా క్లాసులు

యోగా క్లాసులు

ప్రజాసేవలో మమేకమైన వారికి ఒత్తిళ్లు ఎక్కువవుతున్నాయన్నారు. జీవన ప్రమాణాలు పెరిగేందుకు సైన్స్ టెక్నాలజీ ఎంత అవసరమో, అంతరంగికంగా నిశ్చలత సాధనకు ధ్యానం చేయాలన్నారు.

యోగా క్లాసులు

యోగా క్లాసులు

1992లో కోయంబత్తూరులో జగ్గీ వాసుదేవ్ ఏర్పాటు చేసిన ఈశా ఫౌండేషన్ ధ్యానం, యోగతో సంచలనమైన విజయాలు సాధిస్తోందన్నారు.

యోగా క్లాసులు

యోగా క్లాసులు

టీమ్‌వర్క్ ద్వారా అద్భుతమైన ఫలితాలు సాధించాలన్నారు. ఆంధ్రప్రదేశ్ సమగ్రాభివృద్ధి సాధించాలని, 2029 నాటికి దేశంలో అగ్రగామిగా ఉండేందుకు ప్రణాళికలు ఖరారు చేశామన్నారు.

యోగా క్లాసులు

యోగా క్లాసులు

ఈ లక్ష్యసాధనకు బలమైన వ్యక్తిత్వం, జవాబుదారీతనం, బాధ్యత అవసరమన్నారు. మూడు రోజుల కార్యక్రమంలో బయటి ప్రపంచంలోని విషయాలు పక్కనపెట్టి ఇక్కడ చెప్పే అంశాలపై శ్రద్ధపెట్టాలన్నారు.

యోగా క్లాసులు

యోగా క్లాసులు

ప్రతి వ్యక్తినూతనమైన ప్రయోగాలు చేయాలని, కొత్త విషయాలు తెలుసుకోవాలన్నారు.

English summary
Andhra Pradesh Chief Minister Sri N. Chandrababu Naidu, Ministers, IAS, IPS and IFS officers and other Officials participated in a three-day workshop, titled 'Inner Engineering for Joyful Living', will be organized by the Isha Foundation headed by Sadhguru Jaggi Vasudev from January 29 to 31.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X