వైఎస్ జగన్ ను కలిసిన ఎన్టీఆర్ కు పిల్లనిచ్చిన మామ నార్నె శ్రీనివాస రావు
హైదరాబాద్: ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేరికల్లో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ప్రముఖ తెలుగు న్యూస్ ఛానల్ స్టూడియో ఎన్ ఛైర్మన్ నార్నె శ్రీనివాస రావు సోమవారం మధ్యాహ్నం హైదరాబాద్ లో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డితో భేటీ అయ్యారు. లోటస్ పాండ్ లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన జగన్ ను కలిశారు. ప్రముఖ నటుడు, యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కు ఆయన స్వయానా పిల్లనిచ్చిన మామ.
ఎన్టీఆర్ భార్య లక్ష్మీ ప్రణతి తండ్రి ఆయన. తెలుగుదేశం పార్టీకి దగ్గరి వ్యక్తిగా, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు బాగా కావాల్సిన వ్యక్తిగా నార్నె శ్రీనివాసరావుకు పేరు ఉంది. దగ్గరి బంధువు కూడా. హఠాత్తుగా ఆయన వైఎస్ జగన్ ను కలవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. నార్నె శ్రీనివాసరావు, జగన్ కొన్ని నిమిషాల పాటు లోటస్ పాండ్ లో ఏకాంతంగా మాట్లాడుకున్నారని చెబుతున్నారు. కొద్దికాలంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వలసలు పెరిగాయి. తెలుగుదేశం పార్టీకి చెందిన పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు జగన్ పార్టీలో చేరుతున్నారు.

తాజాగా ఆ పార్టీ లోక్ సభ సభ్యుడు పండుల రవీంద్రబాబు జగన్ ను కలిసిన రెండు గంటల వ్యవధిలో నార్నె శ్రీనివాసరావు కూడా జగన్ ను కలవడంతో రాజకీయ ప్రాధాన్యత ఏర్పడింది. ఆయన కూడా వైఎస్ఆర్ సీపీలో చేరుతున్నారనే వార్తలు ఒక్కసారిగా గుప్పుమన్నాయి. నార్నె శ్రీనివాస రావు దీన్ని తోసిపుచ్చారు. తాను మర్యాదపూరకంగా మాత్రమే జగన్ ను కలవడానికి వచ్చానని అన్నారు. జగన్ తో భేటీ అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. తమ భేటీకి రాజకీయ ప్రాధాన్యత లేదని చెప్పారు. వ్యక్తిగత కారణాలతో కలిశానని చెప్పారు. జగన్ తో తనకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని చెప్పారు.
-
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్












Click it and Unblock the Notifications