నగరిలో మంత్రి రోజా కు గెలుపు కష్టమేనా - గట్టెక్కించేది అదొక్కటే..!!
మంత్రి రోజా సొంత నియోజకవర్గంలో సమీకరణాలు మారుతున్నాయి. మంత్రి రోజా కు సొంత పార్టీ నుంచే సమస్యలు ఎదురవుతున్నాయి. దీంతో, 2024 ఎన్నికల్లో నగరిలో రోజా గెలవాలంటే ప్రత్యర్ధి పార్టీల కంటే సొంత పార్టీపైనే ఎక్కువగా పోరాటం చేయాల్సిన పరిస్థితులు ఉన్నాయని చెబుతున్నారు. నియోజకవర్గంలో నెలకొన్న పరిస్థితుల పైన తాజాగా మంత్రి రోజా ఆవేదన వ్యక్తం చేసారు. ఇలాగే ఉంటే రాజకీయం చేయలేమంటూ వ్యాఖ్యానించారు. మంత్రి రోజా 2014, 2019 ఎన్నికల్లోనూ స్వల్ప మెజార్టీతోనే గెలుపొందారు. 2019 ఎన్నికల్లో రోజా వరుసగా నగరి నుంచి రెండో సారి గెలుపొందారు. ఆ సమయంలోనే రోజా కు వ్యతిరేకంగా నియోజకవర్గంలో ఒక వర్గం పని చేసింది. నియోజకవర్గంలో రోజా వ్యతిరేక వర్గం గతం కంటే మరింతగా బలపడింది.
మంత్రికి అసమ్మతి నేతలే సమస్య
రెండో సారి గెలిచిన సమయం నుంచి రోజాకు వ్యతిరేక వర్గం నియోజకవర్గంలో బలం పెంచుకొనే ప్రయత్నం చేస్తోంది. వారికి పార్టీలోని కొందరు ముఖ్య నేతల మద్దతు ఉందని రోజా వర్గీయులు చెబుతున్నారు. నిండ్ర మండలానికి చెందిన చక్రపాణిరెడ్డి పార్టీలో పట్టు ఉంది. దీంతో, వచ్చే ఎన్నికల్లో రోజా తిరిగి నగరి నుంచి పోటీ చేసినా..పార్టీలోని వ్యతిరేకులు ఎంత వరకు సహకరిస్తారనేది సందేహంగా మారుతోంది. నియోజకవర్గాల వారీగా సమీక్షలు చేస్తున్న సీఎం జగన్ నగరి నియోజకవర్గం పైన సమీక్షలో మంత్రి రోజా - నియోజకవర్గంలోని అసమ్మతి వర్గానికి ఏం చెబుతారనేది తేలిపోనుంది. అయితే, రోజాకు ఇప్పటి వరకు సొంత పార్టీలో వ్యతిరేకత ఉన్నా, కలిసి వచ్చే అంశం మాత్రం ఊరటనిస్తోంది.

సీఎం జగన్ - చంద్రబాబుకు కీలకం
ఇక్కడ టీడీపీ నుంచి గాలి భానుప్రకాశ్ కు పార్టీ అధినేత చంద్రబాబు బాధ్యతలు అప్పగించారు. 2019 ఎన్నికల్లో రోజా మీద పోటీ చేసిన భాను ఓడిపోయారు. తిరిగి పోటీ చేసేందుకు సిద్దమవుతున్నారు. కానీ, ఆయన సోదరుడు జగదీష్ వ్యతిరేకంగా మారటం వైసీపీకి కలిసి వచ్చే అంశం. గాలి కుమారులిద్దరూ కలిసి పార్టీ కోసం పని చేయాలని టీడీపీ అధినేత నిర్దేశించారు. 2024 ఎన్నికల్లో రోజా ఎట్టి పరిస్థితుల్లో గెలవకూడదనేది చంద్రబాబు లక్ష్యం. గెలిపించుకోవటం సీఎం జగన్ బాధ్యత అన్నట్లుగా పరిస్థితి మారింది. కానీ, క్షేత్ర స్థాయిలో నగరి టీడీపీలో సఖ్యత కనిపించటం లేదు. ఇటు మంత్రి రోజా కు వ్యతిరేకంగా నియోజకవర్గంలో బలమున్న నేతలు ఒక్కటవుతున్నారు.

నగరిలో మారుతున్న పరిస్థితులు
మంత్రి రోజా తమను నియోజకవర్గంలో పట్టించుకోవటంలేదని వారు సీఎం వద్ద ఫిర్యాదు చేసేందుకు సిద్దమవుతున్నారు. ముఖ్యమంత్రి జగన్ తనకు అండగా నిలుస్తారని రోజా విశ్వసిస్తున్నారు. నియోజవర్గంలోని నిండ్ర, విజయపురం మండలాల్లో రోజాకు సొంత పార్టీ నేతల వ్యతిరేకత ఎక్కువగా ఉందని తెలుస్తోంది. దీంతో.. ఇప్పుడు 175 సీట్లు గెలవాలనే లక్ష్యంతో ఉన్న సీఎం జగన్ కు తన కేబినెట్ ఫైర్ బ్రాండ్ రోజా నియోజకవర్గంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారనేది ఆసక్తి కరంగా మారుతోంది.
-
ఇకపై రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం!












Click it and Unblock the Notifications