ఘోర రోడ్డు ప్రమాదం: పెళ్లి ట్రాక్టర్ బోల్తా పడి ఆరుగురు మృతి, 19 మందికి గాయాలు
చిత్తూరు: జిల్లాలోని పూతలపట్టు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. లక్ష్మయ్యఊరులో పెళ్లి ట్రాక్టర్ బోల్తా పడి ఆరుగురు మృతి చెందారు. మరో 19 మంది గాయాలపాలయ్యారు. మృతుల్లో ముగ్గురు మహిళలు, ఇద్దరు చిన్నారులు ఉన్నారు.
పూతలపట్టు మండలం జట్టిపల్లిలో ట్రాక్టర్పై పెళ్లికి వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి వెళ్లి సహాయ చర్యలు చేపట్టారు. గాయపడినవారిని తిరుపతి స్విమ్స్, వేలూరు సీఎంసీకి తరలించారు.

మృతులు ఐరాల మండలం బలిజపల్లికి చెందినవారిగా గుర్తించారు. ప్రమాదం జరిగిన సమయంలో బలిజపల్లికి చెందిన 26 మంది ట్రాక్టర్లో ఉన్నారు. అతివేగం కారణంగానే ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది.
రైలు కిందపడి యువకుడు ఆత్మహత్య
విశాఖపట్నం జిల్లాలోని మర్రిపాలెం రైల్వేస్టేషస్టే న్ వద్ద ఓ యువకుడి మృతదేహన్ని పోలీసులు గుర్తించారు. మృతుడు ఇంజినీరింగ్ చదువుతున్న పవన్గా గుర్తిం చారు. పవన్ వద్ద లభించిన ఆధారాలతో రైలుకింద పడి ఆత్మహత్య చేసుకున్నట్లు భావిస్తున్నారు. ఆత్మహత్యకు ముందు సెల్ఫోన్ నుంచి తల్లిదంల్లి డ్రులకు.. 'మిమ్మల్ని బాధపెట్టాను... సుమారు లక్ష వరకు అప్పు చేశాను' అనిమెసేజ్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. తన వల్ల భవిష్యత్తులోనూ తల్లిదండ్రులకు ఇబ్బం దులు తప్పవంటూ.. 'నాన్నా ఐ లవ్యూ' అని మెసేజ్ పంపినట్లు పోలీసులు చెప్పారు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications