విషాదం మిగిలింది : సూర్యలంక బీచ్లో.. బీటెక్ విద్యార్థి గల్లంతు, మరొకరు మృతి
బాపట్ల : సరదాగా సముద్ర తీరానికి వెళ్లిన బిటెక్ విద్యార్థినులు విషాదమై వార్తల్లోకి ఎక్కారు. బాపట్లలోని వడ్లమూడి విజ్ఞాన్ ఇంజినీరింగ్ కాలేజీలో బిటెక్ చదువుతోన్న విద్యార్థినులు ప్రత్యూష, సుష్మప్రియ, శ్రావ్య, సత్య సముద్ర తీరంలో స్నానం చేసేందుకు సూర్యలంక బీచ్ కు వెళ్లారు.
ఈ క్రమంలో ప్రమాదవశాత్తు సముద్ర అలల్లో వీరంతా కొట్టుకుపోయినట్లు సమాచారం. విద్యార్థినులు నీట మునిగిన విషయం తెలుసుకున్న స్థానిక మత్స్యకారులు, మెరైన్ పోలీసులు వారి కోసం ముమ్మరంగా గాలించారు. గాలింపు చర్యల్లో భాగంగా.. ప్రత్యూష, సుష్మాప్రియ, శ్రావ్య అనే ముగ్గురు విద్యార్థినులను ఒడ్డుకు చేర్చారు.

అనంతరం ప్రభుత్వ అంబులెన్స్ కోసం 108కు ఫొన్ చేసి విద్యార్థినులను ఆసుపత్రికి తరలించగా.. మార్గమధ్యలోనే ప్రత్యూష అనే విద్యార్థిని మృతి చెందింది. ప్రస్తుతం సుష్మప్రియ, శ్రావ్య ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా.. గల్లంతయిన సత్య కోసం పోలీసుల గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.
-
మెగాస్టార్కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
ఢిల్లీలో జగన్ రూటు మారిందా, పార్లమెంట్ సాక్షిగా - కీలక మలుపు..!! -
T20 World Cup: సూర్యకుమార్ యాదవ్ కు ఐసీసీ అనూహ్య షాక్..! -
India Post GDS 2nd Merit List 2026: పోస్టల్ జాబ్స్ రెండో మెరిట్ లిస్ట్ అప్పుడే? -
టీం ఇండియాకు బీసీసీఐ భారీ నజరానా, ఒక్కొక్కరికి ఎంతంటే..!! -
పెట్రోల్ పై కేంద్రం ఎస్మా ప్రయోగం:LPG ఉత్పత్తి పెంచాలని హుకుం -
భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు! -
మిథున రాశి 2026 2027 జాతకం.. ఈ ఏడాది వీరి మాటే శాసనం! -
టీమిండియాపై విధ్వంసకర సెంచరీ: కెప్టెన్గా ప్రమోషన్ -
వరల్డ్ కప్ గెలిచినా తప్పని చిక్కులు! ఆ ఆటగాడిపై ఐసీసీ వేటు?












Click it and Unblock the Notifications