నంద్యాలలో తీవ్ర విషాదం.. మిద్దెకూలి నలుగురు మృతి..
ఆంధ్రప్రదేశ్లోని నంద్యాల జిల్లా చాగల్లమర్రిలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. చినవంగలి గ్రామంలోమట్టిమిద్దె కూలి ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృత్యువాత పడ్డారు. చనిపోయిన వారిలో ఇద్దరు చిన్నారులతో భర్త, భార్య కూడా ఉన్నారు. శిథిలాల కింద పడి ఉన్న మృతదేహాలను స్థానికులు వెలికి తీసే ప్రయత్నంలో ఉన్నారు. ఈ సంఘటన చాగలమర్రి మండలం చిన్న వంగలిలో చోటుచేసుకుంది.
చనిపోయిన వారిని గురుశేఖర్రెడ్డి (45), దస్తగిరమ్మ (38) దంపతులు ఉండగా, వారి ఇద్దరు కుమార్తెలైన పవిత్ర (16), గురులక్ష్మి(10)లు ఉన్నట్లు స్థానికులు గుర్తించారు. కుటుంబంలో మొత్తం ఐదుగురు సభ్యులు ఉండగా, రెండో కుమార్తె ప్రసన్న కడప జిల్లా ప్రొద్దుటూరు ఉషోదయ పాఠశాలలో చదువుతున్నట్లు సమాచారం. ఈ తీవ్ర విషాద ఘటన నిన్న (గురువారం) అర్థరాత్రి సమయంలో జరిగినట్లు తెలుస్తోంది.

అయితే, శుక్రవారం తెల్లవారుజామున ఈ విషయాన్ని గమనించిన స్థానికులు శిథిలాలను తొలగించి చూడగా అప్పటికే కుటుంబంలోని నలుగురు మృతిచెందారు. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు సభ్యులు చనిపోవడంతో ఆ గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది.

గ్రామస్థులంతా కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని మృతిదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లారు. ఇక, ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.
-
పీఎం కిసాన్ - అన్నదాత సుఖీభవ నిధుల జమ: ఖాతాల్లో రూ 6 వేలు, తాజా నిర్ణయం..!! -
మోదీ కేబినెట్ లోకి జనసేన, ఏపీలో బీజేపీకి మరో మంత్రి పదవి - ఆయనకే ఛాన్స్..!! -
మందుబాబులకు కిక్ ఇచ్చే కబురు- ఏప్రిల్ 1 నుండి.. -
విజయ్, త్రిష పెళ్లి డేట్ ఫిక్స్.. ఎన్నికలకు ముందే..!! -
T20 World Cup Final: అచ్చిరాని స్టేడియంలో కివీస్ తో ఫైనల్-పిచ్ లో కీలక మార్పు..! -
T20 WC 2026 ఫైనల్ గెలిచేది ఆ జట్టే: మహమ్మద్ అమీర్ -
T20 World Cup: భారత్ కు అదే మైనస్, మాకు ప్లస్-ఫైనల్ పై తేల్చేసిన కివీస్ కెప్టెన్..! -
H1B Visa న్యూ రూల్- గుడ్ న్యూస్ -
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
విజయ్ నన్ను రోడ్డున పడేశాడు: మళ్లీ కోర్టుకెక్కిన సంగీత -
వారానికో సూపర్ హిట్ సినిమా ఎలా ఇస్తావ్ అన్నా..! -
today rashiphalalu: మీనరాశిలో శనిశుక్రుల బలమైన సంయోగంతో వీరికి జాక్ పాట్!












Click it and Unblock the Notifications