నంద్యాలలో తీవ్ర విషాదం.. మిద్దెకూలి నలుగురు మృతి..
ఆంధ్రప్రదేశ్లోని నంద్యాల జిల్లా చాగల్లమర్రిలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. చినవంగలి గ్రామంలోమట్టిమిద్దె కూలి ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృత్యువాత పడ్డారు. చనిపోయిన వారిలో ఇద్దరు చిన్నారులతో భర్త, భార్య కూడా ఉన్నారు. శిథిలాల కింద పడి ఉన్న మృతదేహాలను స్థానికులు వెలికి తీసే ప్రయత్నంలో ఉన్నారు. ఈ సంఘటన చాగలమర్రి మండలం చిన్న వంగలిలో చోటుచేసుకుంది.
చనిపోయిన వారిని గురుశేఖర్రెడ్డి (45), దస్తగిరమ్మ (38) దంపతులు ఉండగా, వారి ఇద్దరు కుమార్తెలైన పవిత్ర (16), గురులక్ష్మి(10)లు ఉన్నట్లు స్థానికులు గుర్తించారు. కుటుంబంలో మొత్తం ఐదుగురు సభ్యులు ఉండగా, రెండో కుమార్తె ప్రసన్న కడప జిల్లా ప్రొద్దుటూరు ఉషోదయ పాఠశాలలో చదువుతున్నట్లు సమాచారం. ఈ తీవ్ర విషాద ఘటన నిన్న (గురువారం) అర్థరాత్రి సమయంలో జరిగినట్లు తెలుస్తోంది.

అయితే, శుక్రవారం తెల్లవారుజామున ఈ విషయాన్ని గమనించిన స్థానికులు శిథిలాలను తొలగించి చూడగా అప్పటికే కుటుంబంలోని నలుగురు మృతిచెందారు. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు సభ్యులు చనిపోవడంతో ఆ గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది.

గ్రామస్థులంతా కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని మృతిదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లారు. ఇక, ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.
-
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్తో ఛాన్స్ కొట్టేసింది! -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
H-1B Visa: హెచ్1బీ లాటరీ నోటీసుల విడుదల-స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
ఏప్రిల్ లో బ్యాంకులకు వరుస హాలిడేస్ - స్కూళ్లకు వేసవి సెలవులపై తాజా ఉత్తర్వులు..!! -
ఇరాన్కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
బంగారం ధరలు తలకిందులు












Click it and Unblock the Notifications