Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఏపీకి రైళ్ళ జాతర..దూసుకురానున్న వందేభారత్, నరసాపురం నుండి మైసూర్ రైళ్ళు!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పనిచేస్తున్న ఎంపీలు, మంత్రులు, కేంద్ర మంత్రులు రైల్వే అభివృద్ధి కోసం శతవిధాల కష్టపడుతున్నారు. మొన్నటికి మొన్న మచిలీపట్నం ఎంపీ బాలశౌరి సికింద్రాబాద్ మచిలీపట్నం కొత్త రైల్వే లైన్ కోసం రైల్వే బోర్డు చైర్మన్ ముందు ప్రపోజల్ పెట్టారు. ఇక తాజాగా ఏపీ ప్రజలకు రెండు శుభవార్తలు చెప్పారు కేంద్రమంత్రి భూపతి రాజు శ్రీనివాస వర్మ.

ఏపీ ప్రజలకు శుభవార్త
నరసాపురం నుండి సికింద్రాబాద్ మీదుగా మైసూర్ వరకు నడిచే ఎక్స్ప్రెస్ రైలుకు కేంద్రం ఆమోదం తెలిపిందని ఆయన ఏపీకి గుడ్ న్యూస్ చెప్పారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా పోస్ట్ చేసిన ఆయన నరసాపురం నుండి మైసూర్ కు హైదరాబాద్ మీదుగా ప్రత్యేక ఎక్స్ప్రెస్ రైలు (ట్రైన్ నెంబర్ 07033/ 07034) ఈనెల 19వ తేదీ నుండి ప్రారంభమవుతుందని కేంద్రమంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ తెలిపారు.

Trains for AP Centre gives green signal for chennai narasapuram Vande Bharat and Narasapuram to Mysore trains

Take a Poll

నరసాపురం నుండి సికింద్రాబాద్ మీదుగా మైసూరుకు రైలు
ఈ రైలు సేవలు పశ్చిమగోదావరి జిల్లా ప్రజలకు ముఖ్యంగా హైదరాబాద్ వెళ్లే వారికి చాలా ప్రయోజనకరంగా ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. నరసాపురం ప్రజలకు మెరుగైన రైలు సేవలు అందించడానికి తాను కేంద్ర మంత్రిగా శతవిధాల కృషి చేస్తానని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. నరసాపురం నుండి సికింద్రాబాద్ మీదుగా మైసూర్ వెళ్లే ఈ రైలు వారంలో రెండు రోజులు అందుబాటులో ఉంటుందన్నారు.

ఏపీలో ఈ రైలు ఆగే స్టేషన్ లు ఇవే
ప్రతీ శుక్రవారం, సోమవారం ఇది నరసాపురం మీదుగా సికింద్రాబాద్ కు, అక్కడినుండి బెంగళూరు, మైసూరు జంక్షన్ కు చేరుకుంటుందని తెలిపారు. నరసాపురంలో బయలుదేరే ఈ రైలు పాలకొల్లు, వీరవాసరం, ఆకివీడు, కైకలూరు, గుడివాడ, విజయవాడ, గుంటూరు, సత్తెనపల్లి, పిడుగురాళ్ల, నడికుడి, మిర్యాలగూడ, నల్గొండ, చర్లపల్లి మీదుగా సికింద్రాబాద్ కు చేరుకుంటుంది.

సికింద్రాబాద్ నుండి బెంగుళూరు మీదుగా మైసూర్
సికింద్రాబాద్ నుండి బేగంపేట, లింగంపల్లి, వికారాబాద్, తాండూరు, సేడం, యాద్గిర్, రాయచూర్, మంత్రాలయం రోడ్, ఆదోని, గుంతకల్లు జంక్షన్, అనంతపురం, ధర్మవరం జంక్షన్, హిందూపురం, యలహంక జంక్షన్, బెంగళూరు కంటోన్మెంట్, బెంగళూరు సిటీ జంక్షన్, కెంగేరి, మాండ్య రైల్వే స్టేషన్ల మీదుగా మైసూర్ జంక్షన్ చేరుకుంటుందని తెలిపారు.

మరో శుభవార్త చెప్పిన కేంద్ర మంత్రి
ఇదే సమయంలో మరో శుభవార్తను కూడా చెప్పిన కేంద్ర మంత్రి చెన్నై నుండి నరసాపురం వరకు వందే భారత్ రైలు నడపడానికి రైల్వే శాఖ ఆమోదం తెలిపిందని ఇది పశ్చిమగోదావరి జిల్లా ప్రజలకు గొప్ప శుభవార్త అని పేర్కొన్నారు. నరసాపురం పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలకు తొలి వందే భారత్ లభించిందని ఆయన తన ట్వీట్లో పేర్కొన్నారు.

చెన్నై నుండి నరసాపురం వరకు వందే భారత్ రైలు
దక్షిణ మధ్య రైల్వే త్వరలోనే గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసి ఎప్పటి నుంచి రైలు ప్రారంభమవుతుందో ప్రకటిస్తారని పేర్కొన్నారు. తాను ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చినందుకు తనకు సంతోషంగా ఉందని ఆయన పేర్కొన్నారు. నరసాపురం వాసులకు మెరుగైన రైలు సేవలను అందించడానికి తన విజ్ఞప్తులకు సానుకూలంగా స్పందించిన రైల్వే శాఖ మంత్రికి, రైల్వే అధికారులకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు కేంద్రమంత్రి భూపతి రాజు శ్రీనివాస వర్మ.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+