వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మూణ్ణెళ్లుగా లేని జీతాలు, పోలవరం ప్రాజెక్టు పనులు నిలిపేసిన ఉద్యోగులు, కార్మికులు

|
Google Oneindia TeluguNews

అమరావతి: పోలవరం ప్రాజెక్టు పనులకు షాక్ మీద షాక్ తగులుతోంది. ఈ పనులు ఒక అడుగు ముందుకు పడితే, రెండు అడుగులు వెనక్కి అన్నట్లుగా ఉంది పరిస్థితి. గురువారం మరోసారి నిర్మాణ పనులు ఆగిపోయాయి.

తాజాగా, ట్రాన్స్‌ట్రాయ్ తమకు జీతాలు ఇవ్వడం లేదంటూ కార్మికులు, ఉద్యోగులు విధులు బహిష్కరించారు. వారు నిరసనకు దిగారు. బుధవారమే వారు నిరసనకు దిగారు. గురువారం పూర్తిస్థాయిలో పనులు ఆపేశారు.

సీజ్: అప్పు చెల్లించలేదని ట్రాన్స్‌ట్రాయ్‌కు బ్యాంక్ గట్టి షాక్, 'పోలవరం'పై ఆందోళనసీజ్: అప్పు చెల్లించలేదని ట్రాన్స్‌ట్రాయ్‌కు బ్యాంక్ గట్టి షాక్, 'పోలవరం'పై ఆందోళన

Transstroy employees stopped polavaram project works

దీంతో కాంక్రీటు నిర్మాణ పనులు నిలిచిపోయాయి. తమకు ట్రాన్స్‌ట్రాయ్ జీతాలు ఇవ్వడం లేదని, ఇంత జరుగుతున్నా ఇరిగేషన్, కార్మిక శాఖ పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

అంతేకాదు, ఇతర వాహనాలు రాకుండా, వెళ్లకుండా రాళ్లు, టైర్లు అడ్డు పెట్టి అడ్డుకున్నారు. ఇటీవలే దివాలా దిశగా పయనిస్తున్న ట్రాన్స్‌ట్రాయ్‌కు రుణాలు చెల్లించకపోవడంతో దేనా బ్యాంకు షాకిచ్చిన విషయం తెలిసిందే.

మరోవైపు, గురువారం పోలవరం ప్రాజెక్టు అథారిటీ సమవేశమైంది. టెండర్ల ఆమోదం అంశంపై చర్చిస్తారు. ట్రాన్స్‌ట్రాయ్ నెల రోజుల పనుల టార్గెట్‌ను చేరుకోలేదు.

English summary
Transstroy employees stopped polavaram project works. They said that company is not giving salaries for three months.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X