నేటి నుంచి ఏపీ సరిహద్దుల్లోనూ ఆంక్షలు- సరుకులు, అత్యవసర వాహనాలకే ఎంట్రీ
ఏపీలో కోవిడ్ కేసుల ఉధృతి నేపథ్యంలో ఇవాళ్టి నుంచి పగటి పూట పాక్షిక కర్ఫ్యూ విధించబోతున్నారు. ఉదయం 6 గంటల నుంచి 12 గంటల వరకు మాత్రమే షాపుల్ని, షాపింగ్ను అనుమతిస్తారు. ఆ తర్వాత కర్ఫ్యూ కొనసాగుతుంది. అదే సమయంలో రాష్ట్ర సరిహద్దుల్లో వాహనాల రాకపోకలపైనా ఆంక్షలు విధించబోతున్నారు.
Recommended Video
కోవిడ్ కేసుల వ్యాప్తి నేపథ్యంలో ఇకపై సరిహద్దుల్లో రవాణాపై ఆంక్షలు విధించనున్నారు. ఏపీతో తెలంగాణ, ఒడిశా, కర్నాటక, తమిళనాడుకున్న సరిహద్దుల్లో ఈ ఆంక్షలు కొనసాగుతాయి. కర్ఫ్యూ సమయంలో ఈ సరిహద్దుల గుండా అత్యవసర వాహనాలు, గూడ్స్ వాహనాలు మాత్రమే రవాణాకు అనుమతిస్తారు. మిగతా వాహనాలకు ఎంట్రీ ఉండదు. ఇప్పటికే మద్యనిషేదం దృష్ట్యా సరిహద్దుల గుండా ఏపీలో ప్రవేశించే వాహనాలను తనిఖీలు చేసి పంపుతున్నారు. ఇప్పుడు అసలు ఎంట్రీయే నిషేధిస్తారు.

ఇప్పటికే తమిళనాడులోకి ఏపీ నుంచి వాహనాల రాకపోకలపై ఆంక్షలున్నాయి. ఈ పాస్ తీసుకుంటే తప్ప ఏపీవాహనాలు తమిళనాడులోకి ప్రవేశించే అవకాసం లేదు. ఇప్పుడు ఏపీ కూడా ఆంక్షలు విధించడంతో ఏపీ-తమిళనాడు బోర్డర్స్లో వాహనాల రాకపోకలపై తీవ్ర ప్రభావం పడనుంది. తెలంగాణ, కర్నాటక, ఒడిశా విషయంలో మాత్రం కర్ఫ్యూ సమయంలోనే వాహనాలను అనుమతించరాదని నిర్ణయించారు.
-
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత -
ఇరాన్ పై ముప్పేట దాడి- కలిసివచ్చిన ఆరు దేశాలు -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
బడ్జెట్ లో ఉద్యోగులు - మహిళలకు కొత్త వరాలు - పెన్షన్, 'కళ్యాణ లక్ష్మీ' పెంపు ఇలా..!! -
కేబినెట్ లోకి విజయశాంతి, పీసీసీ చీఫ్ మార్పు - ఆ ఇద్దరూ ఔట్..కొత్తగా..!! -
బెంగళూరులో రెండో భారీ ఎయిర్ పోర్ట్ కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం












Click it and Unblock the Notifications