ఎస్టీ రిజర్వేషన్లు: గిరిజనులు, మత్స్యకారుల మధ్య ఘర్షణ
శ్రీకాకుళం: ఎస్టీ జాబితాలో చేర్చాలంటూ మత్స్యకారులు చేస్తున్న ఆందోళన శిబిరాన్ని గిరిజనులు శుక్రవారం నాడు దగ్దం చేశారు. తాము కూడ ఆందోళన కొనసాగిస్తామని ప్రకటించారు. ఇతర కులాలను ఎస్టీ జాబితాలో చేర్చవద్దని వారు ఆందోళన నిర్వహించారు. ఈ ఆందోళన సందర్భంగా సోమవారం నాడు శ్రీకాకుళం కలెక్టరేట్ వద్ద స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకొంది.

మత్స్యకారులు, బోయ, బెంతు ఒరియాలను ఎస్టీ జాబితాలో చేర్చవద్దని డిమాండ్ చేశారు. అసెంబ్లీలో చేసిన తీర్మానాన్ని రద్దు చేయాలని సీఎంకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. జిల్లా కలెక్టర్ ధనుంజయరెడ్డి జోక్యం చేసుకుని ఐక్యవేదిక ప్రతినిధులతో మాట్లాడారు. డిమాండ్ను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని చెప్పడంతో వారు ఆందోళన విరమించారు.
ఎస్పీ త్రివిక్రమవర్మ ఆందోళనకారులకు నచ్చజెప్పి ఈ తరహా దాడులు చేపడితే ఇబ్బందులు ఎదుర్కొంటారని హెచ్చరించారు. సమస్యను శాంతియుతంగా పరిష్కరించుకోవాలని సూచించారు. తాము కూడ ఆందోళనలను కొనసాగిస్తామని గిరిజనులు కూడ ప్రకటించారు.












Click it and Unblock the Notifications