జగన్ సర్కార్ కు గుడ్ న్యూస్-ఇన్వెస్టర్ల సదస్సుకు ముందే పెట్టుబడి-వెయ్యి కోట్ల పరిశ్రమ..
ఏపీలో వచ్చే నెల 3,4 తేదీల్లో గ్లోబల్ ఇన్వెస్టర్స్ మీట్ నిర్వహించేందుకు సిద్దమవుతున్న వైసీపీ ప్రభుత్వానికి ఇవాళ ఓ పెట్టుబడిదారు వెయ్యి కోట్ల పరిశ్రమ పెడతానంటూ ఆఫర్ ఇచ్చారు
ఏపీలో వచ్చే నెల 3, 4 తేదీల్లో ప్రభుత్వం పెట్టుబడుల ఆకర్షణ కోసం గ్లోబల్ ఇన్వెస్టర్స్ మీట్ నిర్వహిస్తోంది. ఈ సదస్సు నిర్వహణతో రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు ఆకర్షించాలనేది ప్రభుత్వ వ్యూహం. ఇందుకోసం వివిధ రాష్ట్రాల్లో కర్టెన్ రైజర్ ఈవెంట్లు నిర్వహిస్తూ పెట్టుబడిదారుల్ని రప్పించే ప్రయత్నాలు చేస్తోంది. ఈ తరుణంలో రాష్ట్రానికి ఇవాళ ఓ పెట్టుబడిదారు భారీ పెట్టుబడితో పరిశ్రమ స్ధాపనకు ముందుకొచ్చారు
సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ను త్రివేణి గ్లాస్ లిమిటెడ్ ఎండీ వరుణ్ గుప్తా కలిశారు.ఏపీలో పెట్టుబడులు, అవకాశాలపై చర్చించారు. ఎలాంటి సహాయ సహకారాలు అందించడానికైనా సిద్దంగా ఉన్నట్లు సీఎం ఆయనకు తెలిపారు. రాష్ట్రంలో పారిశ్రామికంగా అనుసరిస్తున్న పారదర్శక విధానాలను వివరించిన సీఎం జగన్.. సుశిక్షితులైన మానవ వనరులు, మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు.

రాష్ట్రంలోని తూర్పుగోదావరి జిల్లా పంగిడిలో రూ.1000 కోట్ల మూలధన పెట్టుబడితో రోజుకు 840 మెట్రిక్ టన్నుల సామర్ధ్యం కలిగిన సోలార్ గ్లాస్ తయారీ కర్మాగారాన్ని ఏర్పాటు చేస్తామని త్రివేణీ గ్లాస్ ఎండీ వరుణ్ గుప్తా ప్రతిపాదించారు. దీనికి సంబంధించిన వివరాల్ని ఆయన సీఎం జగన్ కు వివరించారు.ఈ పరిశ్రమ ద్వారా 2,000 మందికి పైగా ప్రత్యక్షంగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించనున్నట్లు వరుణ్ వెల్లడించారు. దీంతో ఆయనకు తగిన సహాయ సహకారాలు అందించేందుకు సీఎం జగన్ హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో సీఎం స్పెషల్ సీఎస్ డాక్టర్ పూనం మాలకొండయ్య, ప్రభుత్వ సలహాదారు ఎస్.రాజీవ్ కృష్ణ కూడా పాల్గొన్నారు.
-
జగన్ బిగ్ ప్లాన్, 2019 కాంబో రిపీట్ - మారుతున్న లెక్కలు..!! -
రేషన్ లబ్దిదారుల కోసం ప్రభుత్వం ఊహించని నిర్ణయం, ఇక నేరుగా..!! -
"దేశంలోనే పెట్టుబడులకు అత్యంత అనుకూలమైన ప్రాంతం ఏపీ" -
ఆ రైతులకు ఏపీ ప్రభుత్వం చల్లని కబురు.. మాట నిలబెట్టుకున్న సీఎం చంద్రబాబు -
స్టీల్ ప్లాంట్ కి కాదు స్టీల్ సిటీకి పునాది.. ప్రపంచస్థాయి నగరంగా విశాఖ: చంద్రబాబు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
ఏపీ సర్కార్ కీలక నిర్ణయం-ఎల్పీజీ సిలెండర్ల స్ధానంలో ఇక..! -
గ్యాస్ కు ప్రత్యామ్నాయంగా నేటినుండి కిరోసిన్ పంపిణీ మొదలెట్టిన ఏపీ ప్రభుత్వం! -
ఆ లాజిక్ ఏంటో ? చంద్రబాబును ఇరుకునపెట్టేసిన సాయిరెడ్డి..! -
జగన్ లాంటి అన్న ఉంటే వేరే శత్రువు అవసరం లేదు! -
హైదరాబాద్ ను మించి అమరావతి నిర్మాణం చేస్తామన్న సీఎం చంద్రబాబు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!!










Click it and Unblock the Notifications