పిచ్చి పట్టింది: ఎపి మంత్రులపై శ్రీనివాస గౌడ్ ఫైర్

తమ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు పాలన చూసి ఎంపి మంత్రులు నేర్చుకోవాల్సింది చాలా ఉందని ఆయన అన్నారు. ఎపి మంత్రుల తీరు చూస్తుంటే గురువింద గింజ నలుపెరుగదన్నట్లుగా ఉందని ఆయన వ్యాఖ్యానించారు. ఎంపి మంత్రులు నోరు అదుపులో పెట్టుకోవాలని ఆయన అన్నారు. ఎపి మంత్రులకు పిచ్చిపట్టినట్లుగా వ్యవహరిస్తున్నారని ఆయన అన్నారు.
ఆంధ్రప్రదేశ్ మంత్రులు తమ బతుకులు తమను బతకనీయాలని ఆయన అన్నారు. ఈ నెల 19వ తేదీనన తమ ప్రభుత్వం నిర్వహిస్తున్న సర్వేపై ప్రజలు సంతోషంగా ఉన్నారని, సీమాంధ్ర నాయకులే భయపడుతున్నారని ఆయన అన్నారు. వాస్తవాలను సర్వే ద్వారా తెలుసుకుందామని అనుకుంటున్నామని ఆయన చెప్పారు.
కుటుంబ సర్వేపై కెసిఆర్ మంచి నిర్ణయం తీసుకున్నారని ఆయన చెప్పారు. హైదరాబాదులో భూములు ఆక్రమించుకున్నవారు, అక్రమాస్తులు కూడబెట్టుకున్నవారు సర్వేకు భయపడుతున్నారని ఆయన అన్నారు. తెలంగాణలో ఆంధ్రవాళ్లు మాత్రమే కాదు, దేశంలోని అన్ని ప్రాంతాలవాళ్లూ ఉన్నారని, ఇతర ప్రాంతాల వాళ్లకు లేని భయం ఆంధ్రావాళ్లకే ఎందుకని ఆయన అన్నారు. ఇతర ప్రాంతాలవాళ్లు తమ నాయకులను, ప్రభుత్వాన్ని విమర్శించడం లేదని అన్నారు. తమ నాయకులను, ప్రభుత్వాన్ని విమర్శిస్తే జరిగే పరిణామాలకు వారే బాధ్యత వహించాల్సి ఉంటుందని ఆయన హెచ్చరించారు.
తెలంగాణలో పనిచేస్తున్న ఆంధ్ర అధికారులు సర్వే నిర్వహణలో పాల్గొనాల్సిందేనని ఆయన అన్నారు. తమ ప్రభుత్వం నుంచి జీతం తీసుకునే ఉద్యోగులంతా సర్వేలో పాల్గొనాలని ఆయన అన్నారు. అలా పాల్గొనని ఉద్యోగుల జాబితాను తయారు చేస్తామని, ప్రభుత్వాన్ని ధిక్కరించినవారు ఏ విధంగా ప్రయోజనం పొందారో తేలుస్తామని ఆయన అన్నారు. ప్రభుత్వ ఆదేశాలను ధిక్కరించేవారిపై చర్యలుంటాయని ఆయన అన్నారు.
-
'రాత్రి 9 దాటితే నాకు ఆ కోరిక తప్పదు!' -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
గ్యాస్ సిలిండర్ ధరలు మళ్లీ పెంపు, ఈ సారి ఎంత..!? -
వంట గ్యాస్ కొరత వేళ చంద్రబాబు కీలక ఆదేశాలు, రాష్ట్రంలో ఇక నుంచి..!! -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
"గోధుమ రవ్వ ఉప్మా" ఇలా చేస్తే ఇంటిల్లిపాది లొట్టలేయాల్సిందే..! -
నేడు, రేపు ఆకాశంలో ఓ అద్భుతం- డోన్ట్ మిస్ -
'బిడ్డను పెంచడానికి ఆ పనికైనా సిద్ధమే' -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
" ప్లీజ్.. ఆ విషయంలో భారత్ ను అడుక్కుంటున్న అమెరికా " -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే












Click it and Unblock the Notifications