వేలు చూపిన రేవంత్, జవదేకర్ హెచ్చరిక (పిక్చర్స్)
మెదక్: మెదక్ జిల్లాలో ఉప ఎన్నికల ప్రచారం గురువారం సాయంత్రంతో ముగిసింది. శనివారం మెదక్ లోకసభకు ఉప ఎన్నిక జరగనుంది.
ఈ ఉప ఎన్నికల్లో భారీ మెజార్టీతో తమను గెలిపించాలని అధికార తెలంగాణ రాష్ట్ర సమితి, కేసీఆర్ బంగారు తెలంగాణ ఆశలు పెట్టి ఏమీ చేయలేకపోతున్నారని, చేతి గుర్తుకు ఓటేసి గెలిపించాలని కాంగ్రెసు పార్టీ ప్రచారం చేసింది.
జగ్గారెడ్డిని గెలిపిస్తే తెలంగాణ రాష్ట్రానికి బాగా నిధులు తెస్తామని, ప్రధాని నరేంద్ర మోడీని తీసుకు వస్తామని బీజేపీ నేతలు చెబుతున్నారు. మెదక్ పోటీ రసవత్తరంగా మారింది.

మెదక్
మెదక్ జిల్లాలో ఉప ఎన్నికల ప్రచారం గురువారం సాయంత్రంతో ముగిసింది. శనివారం నాడు మెదక్ లోకసభకు ఉప ఎన్నిక జరగనుంది.

తెరాస
పేద ప్రజల అభ్యున్నతే లక్ష్యంగా ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రణాళికలు రూపొందించి అమలు చేస్తుండగా, రాష్ట్రంలో టిఆర్ఎస్ తిరుగులేని శక్తిగా ఎదిగామని తెరాస తన ప్రచారంలో చెప్పింది.

తెరాస
గురువారం గజ్వేల్లో నిర్వహించిన కార్యక్రమంలో తెలంగామ రాష్ట్ర మంత్రి కల్వకుంట్ల తారక రామారావు పాల్గొని ప్రసంగించారు. డిపాజిట్ కోసం పాకులాడుతున్న కాంగ్రెస్, బిజెపిలకు అది కూడా కష్టం కానుండగా, జీర్ణించుకోలేని ఆ పార్టీల నేతలు రాష్ట్ర, జాతీయ నేతలను తెచ్చి కెసిఆర్ను తిట్టిపిస్తున్నట్లు ఎద్దేవా చేశారు.

తెరాస
పేద, బడుగు, బలహీన వర్గాల సంక్షేమం టీఆర్ఎస్తోనే సాధ్యపడనుండగా, ఎన్నికల మెనిఫెస్టోలో పొందుపర్చిన హామీల ఆమలుకు కట్టుబడి పని చేస్తూ 100 రోజుల్లో వందకు పైగా సంక్షేమ పథకాల జీఓలు విడుదల చేసినట్లు పేర్కొన్నారు.

బీజేపీ
మెదక్ జిల్లాలోని గజ్వేల్లో భారతీయ జనతా పార్టీ నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడుతున్న తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేతలు.

బీజేపీ
మెదక్ జిల్లాలోని గజ్వేల్లో భారతీయ జనతా పార్టీ నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడుతున్న కేంద్రమంత్రి ప్రకాశ్ జవదేకర్ దృశ్యం.

బీజేపీ
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ల సంక్షేమానికి కట్టుబడిన మోది సర్కార్ పనిచేస్తోందని కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్పేర్కొన్నారు.

బీజేపీ
గురువారం మెదక్ జిల్లా గజ్వేల్లో జరిగిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. జన్ధన్తో పేదలకు బీమా సౌకర్యం కలిగిస్తుండగా, వైద్య సేవల నిమిత్తం రూ.30వేల ఆర్థిక సహాయం కూడా ఖాతాలలో జమచేయనున్నట్లు స్పష్టం చేశారు.

బీజేపీ
దేశ వ్యాప్తంగా 3కోట్ల మంది పేదలు జీరో బ్యాలెన్స్తో ఖాతాలు తెరిచారని, ప్రతి ఒక్కరూ ఈ పథకాన్ని సద్వినియోగం చేసు కోవాలని కోరారు.

బీజేపీ
ఇచ్చిన మాటకు కట్టుబడిన బిజెపి పార్లమెంటులో తెలంగాణ ఏర్పాటుకు మద్దతు ప్రకటించగా, భద్రాచలం డివిజన్లోని ఏడు మండలాలను ఎపిలో కలపడంపై బిజెపి సర్కార్కు ఎలాంటి సంబంధం లేదని తెలిపారు.

బీజేపీ
రాజకీయ లబ్ధికోసం టిఆర్ఎస్, కాంగ్రెస్ పాకులాడుతున్నట్లు విమర్శించారు. అయితే 2019లో బిజెపి, టిడిపి కలిసి సార్వత్రిక ఎన్నికల్లో కలసి పోటీ చేయనుండగా, ఇప్పుడు ఎన్నికలు పెడితే మోది హవాలో ఉమ్మడి అభ్యర్థులు విజయం సాధించడం ఖాయమని చెప్పారు.

బీజేపీ
పేద వర్గాలకు అంకితమైన బిజెపి సర్కార్ వంద రోజుల్లో అనేక విజయాలు సాధించి వెలుగులు నింపుతుండగా, తెలంగాణ, ఎపిలు బిజెపికి రెండు కళ్లులాంటివని పేర్కొన్నారు.

బీజేపీ
ఐక్యమత్యంతో ముందుకు సాగితేనే అభివృద్ధి సాధ్యపడుతుందని, తెలంగాణ ప్రభుత్వం దౌర్జన్య పూరిత విధానాలకు స్వస్తి చెప్పి అభ్యున్నతిపై దృష్టి సారించాలని తెలిపారు.

బీజేపీ
దేశంలో పెట్టుబడులు పెట్టడానికి పారిశ్రామిక వేత్తలు ముందు కు వస్తుండగా, గత ప్రభుత్వాలు అనుమతులు ఇవ్వని ఫలితంగా కొంత కాలయాపన జరుగుతున్నట్లు స్పష్టం చేశారు.

బీజేపీ
టిడిపి నేత ప్రతాప్ రెడ్డి అధ్యక్షత వహించగా, కేంద్ర రైల్వే మంత్రి సదానందగౌడ, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, ఎంపి బండారు దత్తాత్రేయ, ఎమ్మెల్సీ దిలీప్కుమార్, టిడిపి తెలంగాణ ఫోరం చైర్మన్ ఎర్రబెల్లి దయాకర్రావు, తెలంగాణ టిడిపి చైర్మన్ రమణ, ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డి, డాక్టర్ లక్ష్మణ్, ధర్మారెడ్డి, రాంచంద్రారెడ్డి, మాజీ ఎంపి గంగారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు సంకినేని వెంకటేశ్వర్రావు, బద్దం బాల్రెడ్డి, నేతలు డాక్టర్ నరేష్బాబు, బిజెపి అభ్యర్థి జగ్గారెడ్డి పాల్గొన్నారు.

బీజేపీ
టిడిపి నేత ప్రతాప్ రెడ్డి అధ్యక్షత వహించగా, కేంద్ర రైల్వే మంత్రి సదానందగౌడ, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, ఎంపి బండారు దత్తాత్రేయ, ఎమ్మెల్సీ దిలీప్కుమార్, టిడిపి తెలంగాణ ఫోరం చైర్మన్ ఎర్రబెల్లి దయాకర్రావు, తెలంగాణ టిడిపి చైర్మన్ రమణ, ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డి, డాక్టర్ లక్ష్మణ్, ధర్మారెడ్డి, రాంచంద్రారెడ్డి, మాజీ ఎంపి గంగారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు సంకినేని వెంకటేశ్వర్రావు, బద్దం బాల్రెడ్డి, నేతలు డాక్టర్ నరేష్బాబు, బిజెపి అభ్యర్థి జగ్గారెడ్డి పాల్గొన్నారు.

బీజేపీ
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ల సంక్షేమానికి కట్టుబడిన మోది సర్కార్ పనిచేస్తోందని కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్ పేర్కొన్నారు.

బీజేపీ
మెదక్ జిల్లాలోని గజ్వేల్లో భారతీయ జనతా పార్టీ నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడుతున్న తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేత రేవంత్ రెడ్డి.

బీజేపీ
గురువారం మెదక్ జిల్లా గజ్వేల్లో జరిగిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. ‘జన్ధన్'తో పేదలకు బీమా సౌకర్యం కలిగిస్తుండగా, వైద్య సేవల నిమిత్తం రూ.30వేల ఆర్థిక సహాయం కూడా ఖాతాలలో జమచేయనున్నట్లు స్పష్టం చేశారు.

బీజేపీ
దేశ వ్యాప్తంగా 3కోట్ల మంది పేదలు జీరో బ్యాలెన్స్తో ఖాతాలు తెరిచారని, ప్రతి ఒక్కరూ ఈ పథకాన్ని సద్వినియోగం చేసు కోవాలని కోరారు.

బీజేపీ
ఇచ్చిన మాటకు కట్టుబడిన బిజెపి పార్లమెంటులో తెలంగాణ ఏర్పాటుకు మద్దతు ప్రకటించగా, భద్రాచలం డివిజన్లోని ఏడు మండలాలను ఎపిలో కలపడంపై బిజెపి సర్కార్కు ఎలాంటి సంబంధం లేదని తెలిపారు.

దత్తాత్రేయ
మెదక్ జిల్లాలోని గజ్వేల్లో భారతీయ జనతా పార్టీ నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడుతున్న సికింద్రాబాద్ ఎంపీ బండారు దత్తాత్రేయ

బీజేపీ
మెదక్ జిల్లాలోని గజ్వేల్లో భారతీయ జనతా పార్టీ నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడుతున్న తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేత ఎర్రబెల్లి దయాకర రావు

బీజేపీ
రాజకీయ లబ్ధికోసం టిఆర్ఎస్, కాంగ్రెస్ పాకులాడుతున్నట్లు విమర్శించారు. అయితే 2019లో బిజెపి, టిడిపి కలిసి సార్వత్రిక ఎన్నికల్లో కలసి పోటీ చేయనుండగా, ఇప్పుడు ఎన్నికలు పెడితే మోడీ హవాలో ఉమ్మడి అభ్యర్థులు విజయం సాధించడం ఖాయమని జవదేకర్ బహిరంగ సభలో చెప్పారు.

బీజేపీ
పేద వర్గాలకు అంకితమైన బిజెపి సర్కార్ వంద రోజుల్లో అనేక విజయాలు సాధించి వెలుగులు నింపుతుండగా, తెలంగాణ, ఎపిలు బిజెపికి రెండు కళ్లులాంటివని బహిరంగ సభలో జవదేకర్ పేర్కొన్నారు.

బీజేపీ
ఐక్యమత్యంతో ముందుకు సాగితేనే అభివృద్ధి సాధ్యపడుతుందని, తెలంగాణ ప్రభుత్వం దౌర్జన్య పూరిత విధానాలకు స్వస్తి చెప్పి అభ్యున్నతిపై దృష్టి సారించాలని సభలో జవదేకర్ హితవు పలికారు.

కాంగ్రెస్
మెదక్ లోకసభ ఉప ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెసు పార్టీ అభ్యర్థి సునీతా లక్ష్మారెడ్డి తరఫున ప్రచారం చేస్తున్న కేంద్ర మాజీ మంత్రి జైపాల్ రెడ్డి, మాజీ ఎంపీ వివేక్, ఎమ్మెల్యే ఉత్తమ్ కుమార్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య తదితరులు.

కాంగ్రెస్
మెదక్ లోకసభ ఉప ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెసు పార్టీ బీజేపీ - టీడీపీ, తెలంగాణ రాష్ట్ర సమితిలకు ధీటుగా చివరి రెండు మూడు రోజులలో ప్రచారం చేసింది.

సునీతా లక్ష్మా రెడ్డి
వ్యక్తులను కించపర్చేలా మాట్లాడటం కేసీఆర్కు తగదని, డబ్బు సంచులు ఇస్తేనే సేవ చేసినట్లా, తెరాస అభ్యర్తి కొత్త ప్రభాకర్ రెడ్డి ఏం చేశారని టిక్కెట్ ఇచ్చారని సునీతా లక్ష్మారెడ్డి ప్రశ్నించారు.

కాంగ్రెస్
మెదక్ లోకసభ ఉప ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెసు పార్టీ అభ్యర్థి సునీతా లక్ష్మారెడ్డి తరఫున ప్రచారం చేస్తున్న కేంద్ర మాజీ మంత్రి జైపాల్ రెడ్డి, మాజీ ఎంపీ వివేక్, ఎమ్మెల్యే ఉత్తమ్ కుమార్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య తదితరులు.
-
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఆ బిల్లులకు ఆమోదం












Click it and Unblock the Notifications