రాజధానిపై మోడీకి టీఎస్సార్ హెచ్చరిక! వెయ్యేళ్ల నష్టం..
న్యూఢిల్లీ/హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్కు ఢిల్లీ తరహా రాజధానిని నిర్మిస్తామని తిరుపతిలో చేసిన హామీని ప్రధాని నరేంద్ర మోడీ నిలబెట్టుకోవాలని కాంగ్రెస్ ఎంపీ సుబ్బిరామిరెడ్డి డిమాండ్ చేశారు. వెంకన్న సన్నిధిలో చేసిన వాగ్దానాన్ని నిలబెట్టుకోకపోతే బాలాజీ క్షమించరని బుధవారం రాజ్యసభలో మోడీని హెచ్చరించారు.
ఏపీకి జరిగిన ఆర్థిక నష్టాన్ని భరించేందుకు వెంటనే రూ.5 వేల కోట్లు కేటాయించాలన్నారు. పునర్వ్యవస్థీకరణ చట్టం క్రింద రూ.15,691 కోట్లను మంజూలు చేయాలన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా, పన్నుల్లో రాయితీలు, ప్రత్యేక అభివృద్ది ప్యాకేజి తదితర హామీలను నిలబెట్టుకోవాలన్నారు. విభజనతో ఏర్పడిన ఆర్థిక సంక్షోభాన్ని తట్టుకునేందుకు అదనంగా రూ.8,606 కోట్ల మేర నిధులను కేటాయించాలన్నారు.

రాజధానిపై చర్చించాలి: పాలడుగు
ఏపీ రాజధాని పైన అన్ని పార్టీలతో ప్రభుత్వం చర్చించాలని కాంగ్రెసు ఎమ్మెల్సీ పాలడుగు వెంకట్రావు సూచించారు. ఈ అంశం పైన ఏర్పాటు చేసిన కమిటీ రాష్ట్రంలోని అన్నిప్రాంతాల్లో పూర్తిగా పర్యటించలేదన్నారు.
శ్రీకృష్ణ కమిటీ నివేదిక పైన సరైన చర్చ జరగక పోవడం వల్ల సీమాంధ్రకు వెయ్యి సంవత్సరాల నష్టం జరిగిందన్నారు. మరోమారు అలాంటి తప్పు వద్దన్నారు. శివరామకృష్ణన్ కమిటీ నివేదికను ప్రజలు, పార్టీల ముందు ఉంచి అభిప్రాయాలు తీసుకోవాలన్నారు. ఆ తర్వాతే రాజధాని పైన నిర్ణయం తీసుకోవాలన్నారు.
-
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
రిలయన్స్ ఇండస్ట్రీస్ బంపర్ ఆఫర్ ఇచ్చిన డొనాల్డ్ ట్రంప్












Click it and Unblock the Notifications