రాజధానిపై మోడీకి టీఎస్సార్ హెచ్చరిక! వెయ్యేళ్ల నష్టం..
న్యూఢిల్లీ/హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్కు ఢిల్లీ తరహా రాజధానిని నిర్మిస్తామని తిరుపతిలో చేసిన హామీని ప్రధాని నరేంద్ర మోడీ నిలబెట్టుకోవాలని కాంగ్రెస్ ఎంపీ సుబ్బిరామిరెడ్డి డిమాండ్ చేశారు. వెంకన్న సన్నిధిలో చేసిన వాగ్దానాన్ని నిలబెట్టుకోకపోతే బాలాజీ క్షమించరని బుధవారం రాజ్యసభలో మోడీని హెచ్చరించారు.
ఏపీకి జరిగిన ఆర్థిక నష్టాన్ని భరించేందుకు వెంటనే రూ.5 వేల కోట్లు కేటాయించాలన్నారు. పునర్వ్యవస్థీకరణ చట్టం క్రింద రూ.15,691 కోట్లను మంజూలు చేయాలన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా, పన్నుల్లో రాయితీలు, ప్రత్యేక అభివృద్ది ప్యాకేజి తదితర హామీలను నిలబెట్టుకోవాలన్నారు. విభజనతో ఏర్పడిన ఆర్థిక సంక్షోభాన్ని తట్టుకునేందుకు అదనంగా రూ.8,606 కోట్ల మేర నిధులను కేటాయించాలన్నారు.

రాజధానిపై చర్చించాలి: పాలడుగు
ఏపీ రాజధాని పైన అన్ని పార్టీలతో ప్రభుత్వం చర్చించాలని కాంగ్రెసు ఎమ్మెల్సీ పాలడుగు వెంకట్రావు సూచించారు. ఈ అంశం పైన ఏర్పాటు చేసిన కమిటీ రాష్ట్రంలోని అన్నిప్రాంతాల్లో పూర్తిగా పర్యటించలేదన్నారు.
శ్రీకృష్ణ కమిటీ నివేదిక పైన సరైన చర్చ జరగక పోవడం వల్ల సీమాంధ్రకు వెయ్యి సంవత్సరాల నష్టం జరిగిందన్నారు. మరోమారు అలాంటి తప్పు వద్దన్నారు. శివరామకృష్ణన్ కమిటీ నివేదికను ప్రజలు, పార్టీల ముందు ఉంచి అభిప్రాయాలు తీసుకోవాలన్నారు. ఆ తర్వాతే రాజధాని పైన నిర్ణయం తీసుకోవాలన్నారు.
-
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
ఏపీ, తెలంగాణలో రెండు కొత్త ఎయిర్పోర్ట్లకు గ్రీన్ సిగ్నల్ - ఈ ప్రాంతాల్లోనే..!! -
PDS Kerosene: మళ్లీ రేషన్ షాపుల్లో కిరోసిన్-కేంద్రం అత్యవసర ఆదేశాలు..! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్ -
విజయ్ పార్టీకి త్రిష శాపం? రెండు చోట్ల ఓటమి ఖాయం! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
కొత్త పెన్షన్ల పై ప్రభుత్వం కీలక నిర్ణయం: పంపిణీ ముహూర్తం, మార్గదర్శకాలు..!! -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
రూట్ మార్చిన ఫరియా.. ఊర మాస్ పాత్రలో హిట్ కొట్టేనా ?? -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం- నేడు ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు












Click it and Unblock the Notifications