TTD: శ్రీవారి దర్శనానికి విచ్చేసే భక్తుల ఆరోగ్య భద్రత, హోటల్ లో కుళ్లిన ఆహారం, సీజ్
తిరుమలకు వచ్చే యాత్రికుల ఆరోగ్య భద్రతకు టీటీడీ పెద్దపీట వేస్తోందని టీటీడీ ఈవో జే. శ్యామలరావు చెప్పారు. తిరుమలలోని కౌస్తుభం విశ్రాంతి భవనం సమీపంలో ఉన్న బాలాజీ భవన్ హోటల్ను ఫుడ్ సేఫ్టీ విభాగం (ఎఫ్ఎస్డి) అధికారుల బృందంతో కలిసి గురువారం ఆకస్మికంగా హోటల్స్ లోకి వెళ్లిన టీటీడీ ఈవో శ్యామలరావు తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా ఈవో శ్యామలరావు, ఎఫ్ఎస్డి డైరెక్టర్ పూర్ణచంద్రరావుతో కలిసి హోటల్లో తయారు చేస్తున్న ఆహార పదార్థాలు, ముడి సరుకుల నిల్వ, శుభ్రపరచడం తదితర పద్ధతులను పరిశీలించారు. బంగాళదుంపలు, కాలీఫ్లవర్ మరియు కొన్ని కిరాణా సామాగ్రితో సహా చాలా కూరగాయలు కుళ్ళిపోయినట్లు టీటీడీ ఈవో శ్యామలరావు, పూర్ణచంద్రరావు గుర్తించారు. పరిశుభ్రత, పారిశుద్ధ్య చర్యలు కూడా నాసిరకంగా ఉన్నాయని హోటల్ సిబ్బందిని ప్రశ్నించారు.

అనంతరం ఈవో శ్యామలరావు మీడియాతో మాట్లాడుతూ, కొందరు శ్రీవారి భక్తులు తిరుమల హోటల్లో భోజనం చేసి అస్వస్థతకు గురయ్యారని, యాత్రికుల నుంచి వరుసగా వచ్చిన ఇ- మెయిల్ లో ఫిర్యాదుల నేపథ్యంలో తాను ఎఫ్ఎస్డి బృందంతో కలిసి హోటల్ లను ఆకస్మికంగా తనిఖీలు చేశామని చెప్పారు. హోటల్ నిర్వాహకులు ఆహార భద్రతా నిబంధనలను పాటించడం లేదని, అపరిశుభ్రత పరిస్థితుల మధ్య హోటల్లో ఆహార పదార్థాలు తయారు చేస్తున్నట్లు టీటీడీ ఈవో శ్యామలరావు మీడియాకు తెలిపారు.
తిరుమలలోని హోటల్ లు పరిశుభ్రమైన మరియు రుచికరమైన ఆహార ఆహారాన్ని అందించాలనే లక్ష్యంతో భవిష్యత్తులో ఇలాంటి దాడులు మరిన్ని నిర్వహించనున్నట్లు టీటీడీ ఈవో శ్యామలరావు తెలిపారు. హోటల్లోని తినుబండారాల తయారీలో నిబంధనలను ఉల్లంఘించినట్లు గుర్తిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం అని టీటీడీ ఈవో శ్యామలరావు పునరుద్ఘాటించారు.

అనంతరం ఎఫ్ఎస్డి డైరెక్టర్ పూర్ణచంద్రరావు మాట్లాడుతూ తనిఖీలలో ఈ హోటల్లో పూర్తిగా ఆహార భద్రతా నిబంధనలను పాటించలేదని తెలిందన్నారు. హోటల్లో కుళ్ళిన కూరగాయలు, ముందు రోజు తయారు చేసిన ఆహారం, పలుమార్లు ఉపయోగించిన నూనె, ఎఫ్ఎస్డి నిబంధనలకు విరుద్ధమైన రంగు, రుచి పెంచే ముడి పదార్థాలను ఉపయోగిస్తున్నట్లు మా తనిఖీలో గుర్తించామని ఆయన చెప్పారు. ఇక్కడి వంటగదిని వెంటనే మూసివేశామని, క్షుణ్ణంగా విచారణ జరిపిన తర్వాత, హోటల్పై తగిన చర్యలు తీసుకుంటామని పూర్ణచంద్రరావు చెప్పారు.












Click it and Unblock the Notifications