TTD: శ్రీవారి ప్రత్యేక దర్శనం, గోల్డెన్ ఛాన్స్ - టోకెన్లు ఇలా..!!
Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. నూతన పాలక మండలి తొలి సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. భక్తుల దర్శన సమయం తగ్గించేలా చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది. అదే విధంగా గతంలో అమలు చేసి రద్దు చేసిన స్థానికులకు ప్రత్యేక దర్శన కోటా పునరుద్దరణకు నిర్ణయించింది. అందులో భాగంగా ఈ డిసెంబర్ 3న అమలుకు ముహూర్తం ఖరారు చేసింది. టోకెన్ల పంపిణీ పైన స్పష్టత ఇచ్చింది.
ప్రత్యేక దర్శనం
టీటీడీ నూతన పాలకమండలి తీసుకున్న నిర్ణయాల్లో భాగంగా స్థానికులకు ప్రతీ మంగళవారం శ్రీవారి దర్శనం కోసం ప్రత్యేకంగా అవకాశం కల్పిస్తున్నారు. అందులో భాగంగా డిసెంబర్ 3వ తేదీ నుంచి ఈ నిర్ణయం అమలు కానుంది. ఇందు కోసం రేపు డిసెంబర్ 1న (ఆదివారం) తిరుపతి మహతి ఆడిటోరియంలో, తిరుమలలోని బాలాజీ నగర్ లోని కమ్యూనిటీ హాల్ నందు ఉదయం 5 గంటలకు టోకెన్లు జారీ చేయనున్నట్లు టీటీడీ ప్రకటించింది.

స్థానికులకు అవకాశం
తిరుపతి అర్బన్, తిరుపతి రూరల్, చంద్రగిరి, రేణిగుంట మండలాలతో పాటు తిరుమలకు చెందిన స్థానికులు తమ ఆధార్ ఒరిజినల్ కార్డును చూపించి టోకెన్లు పొందవచ్చని టిటిడి తెలిపింది. టీటీడీ పాలక నవంబర్ 18న జరిగిన తొలి సమావేశంలో ప్రతి నెలా మొదటి మంగళవారం స్థానికులకు శ్రీవారి దర్శనం కల్పించాలని నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ నెల నంచే అమలుకు శ్రీకారం చుట్టింది .గతంలో ఈ విధానం అమల్లో ఉండేది. మధ్యలో నిలిపివే యటంతో స్థానికుల నుంచి వస్తున్న అభ్యర్ధన మేరకు తిరిగి పునరుద్దించారు. ఈ నిర్ణయం పైన స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
వైకుంఠ ద్వార దర్శనం
ఇక, వచ్చే జనవరిలో వచ్చే వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని తిరుమల తిరుపతి దేవస్థానంలో విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. 2025లో జనవరి 10 నుంచి 19వ తేదీ వరకు దాదాపు పది రోజులపాటు స్వామి వారి వైకుంఠ ద్వార దర్శనానికి అవకాశం కల్పిస్తున్నారు. ఈ సమయంలో వీఐపీ ప్రొటోకాల్ దర్శనాలు మినహా చంటిపిల్లలు, వృద్ధులు, దివ్యాంగులు, ఆర్మీ, ఎన్ఆర్ఐల దర్శనాలు, ఇతర ఆర్జిత సేవలు రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. సామాన్య భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం కలిగేలా ఈ సారి ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు
-
తిరుమల తరహాలో గుంటూరు, విశాఖలలో... మంత్రి గుడ్ న్యూస్! -
కుటుంబ సమేతంగా తిరుమలకు చేరుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు.. -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
విడాకులపై మెగా డాటర్ "నిహారిక" కామెంట్స్.. అసలు కాంటాక్ట్ కూడా లేదు ?? -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!!












Click it and Unblock the Notifications