పవన్ అభ్యర్ధనను తిరస్కరించిన TTD, అసలు ఏం జరిగింది..!!
తిరుమలలో వైకుంఠ ఏకాదశి పర్వదిన సందడి మొదలైంది. శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం కోసం టీటీడీ భారీ ఏర్పాట్లు చేసింది. ఈ అర్ద్రరాత్రి నుంచి వైకుంఠ ద్వార దర్శనాలు తెరుచుకో నున్నాయి. పది రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనాలు కల్పించాలని టీటీడీ నిర్ణయించింది. ఈ సారి సాధారణ భక్తులకు ప్రాధాన్యత ఇస్తామని టీటీడీ వెల్లడించింది. కాగా, డిప్యూటీ సీఎం పవన్ తో పాటుగా మరో మంత్రి చేసిన అభ్యర్ధనను టీటీడీ తిరస్కరించింది.
ప్రభుత్వంలోని ఇద్దరు ప్రముఖుల ప్రతిపాదనలను టీటీడీ తిరస్కరించింది. ఉపముఖ్యమంత్రి పవన్ తో సహా రెవిన్యూ మంత్రి అనగాని తాజాగా టీటీడీకీ ప్రత్యేకంగా వినతులు చేసారు. తిరుమల లో పంచాయతీరాజ్, రెవెన్యూ శాఖలకు అతిథిగృహాల నిర్మాణానికి భూమి కేటాయించాలని కోరుతూ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి అనగాని సత్యప్రసాద్ అభ్యర్ధించారు. కాగా, వీరిద్దరి
అభ్యర్థనలను టీటీడీ తిరస్కరించిన విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది.

వీఐపీల ప్రొటోకాల్, తిరుమలలో ఉత్సవాల ఏర్పాట్లలో రెవెన్యూ శాఖది కీలక పాత్ర. ఈ అవసరాల దృష్ట్యా తిరుమల లో తమకు ప్రత్యేకంగా అతిథిగృహం అవసరమని ఆ శాఖ భావించింది. విషయాన్ని మంత్రి అనగాని సత్యప్రసాద్ దృష్టికి తీసుకెళ్లడంతో తిరుమల కొండపైన 2ఎకరాల భూమి కేటాయించాల ని కోరుతూ ఆయన టీటీడీకి లేఖ రాశారు.
అయితే, దీని కంటే ముందు పంచాయతీరాజ్ భవన్ పేరుతో అతిథిగృహం నిర్మించుకోవడానికి తిరుమలలో స్థలం కేటాయించాలని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కార్యాలయం నుంచి కూడా లేఖ అందింది. ఈ రెండింటిపై 16న జరిగిన టీటీడీ పాలకమండలి సమావేశంలో చర్చించారు. కొండపైన భూమి లభ్యత పరిమితంగా ఉన్నందున కొన్నేళ్లుగా కొత్త నిర్మాణాలపై నిషేధం ఉంది. ఈ విషయంలో హైకోర్టు పలు పరిమితులు విధించడంతో శిథిలావస్థకు చేరిన గెస్ట్హౌస్లు, కాటేజీ లను పునర్నిర్మించడానికే టీటీడీ పరిమితం అవ్వాలని డిసైడ్ అయింది.
ఇందులో భాగంగానే డిప్యూటీ సీఎం, మంత్రుల అభ్యర్థనలను టీటీడీ పాలకమండలి తిరస్కరించింది. అయితే ప్రత్యామ్నాయంగా తిరుమలలో ఇప్పటికే వున్న అతిథిగృహాల్లో అనువైన భవనాన్ని కేటాయించా లని నిర్ణయించింది. అయితే.. టీటీడీ ఇప్పటికే ఉన్న అతిథిగృహాల పేర్ల విషయంలోనూ కీలక నిర్ణయం తీసుకుంది. దేవుడి పేర్లతోనే వీటిని నిర్వహించాలని దాతలకు స్పష్టం చేస్తూ కొత్త పేర్లను ఖరారు చేసింది.
-
పవర్ స్టార్ "OG" సీక్వెల్ షూటింగ్ షురూ.. టైటిల్ ఇదే ?? -
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!!












Click it and Unblock the Notifications