తిరుమలలో ఉగాది ఆస్థానం: రెండు రోజులు బ్రేక్ దర్శనాలు -సేవలు రద్దు..!!
తిరుమలలో ఉగాది ఆస్థానం వేళ రెండు రోజులు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేస్తూ టీటీడీ నిర్ణయించింది.
Tirumala: కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో ఈ నెల 22న శ్రీ శోభకృత్ నామ సంవత్సర ఉగాది ఆస్థానం శాస్త్రోక్తంగా నిర్వహించాలని టీటీడీ నిర్ణయించింది. ప్రతీ ఏటా ఉగాది నాడు తిరుమలలో ఆస్థానం నిర్వహిస్తారు. ఈ ఏడాది 22వ తేదీన ఉగాది రోజున సుప్రభాత సేవ అనంతరం ఆలయాన్ని శుద్ది చేయనున్నారు. ఉదయం 6 గంటలకు భూదేవి శ్రీదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారికి మరియు విష్వక్సేనుల వారికి విశేష సమర్పణ ఉంటుందని టీటీడీ స్పష్టం చేసింది. ఆ రోజు నిర్వహించే కార్యక్రమాలతో పాటుగా సేవలు..బ్రేక్ దర్శనాలకు సంబంధించి టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది.

ఉగాది ఆస్థానంకు ఏర్పాట్లు
ఉగాది రోజు ఆలయ శుద్ది తరువాత ఉదయం 7 నుండి 9 గంటల మధ్య సమయంలో విమాన ప్రాకారం, ధ్వజస్తంభం చుట్టూ ఊరేగింపుగా ఆలయంలోనికి ప్రవేశిస్తారని టీటీడీ అధికారులు వివరించారు. ఆ తరువాత శ్రీవారి మూలవిరాట్టుతో పాటుగా ఉత్సవమూర్తులకు నూతన వస్త్రాలను అలంకరిస్తారు. అనంతరం పంచాగ శ్రవణం నిర్వహిస్తారు. ఉగాది ఆస్థానాన్ని బంగారు వాకిలి వద్ద ఆగమ పండితులు, అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహిస్తారు. ప్రతీ ఏటా నిర్వహించే విధంగానే ఈ సారి కూడా శాస్త్రోక్తంగా కార్యక్రమాలు కొనసాగుతాయని స్పష్టం చేసారు. ఇదే సమయంలో ఉగాది ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని మార్చి 22వ తేదీన శ్రీవారి ఆలయంలో నిర్వహించే ఆర్జితసేవలైన కళ్యాణోత్సవం, ఊంజల్సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవంలను టిటిడి రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది.

రెండు రోజులు బ్రేక్ దర్శనాల రద్దు
ఇదే సమయంలో టీటీడీ మరో కీలక నిర్ణయం తీసుకుంది. సేవలతో పాటుగా రెండు రోజులు బ్రేక్ దర్శనాలను టీటీడీ రద్దు చేసింది.తిరుమల శ్రీవారి ఆలయంలో మార్చి 21న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం, మార్చి 22న ఉగాది ఆస్థానం నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా మార్చి 21, 22వ తేదీల్లో విఐపి బ్రేక్ దర్శనాలను టిటిడి రద్ధు చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో, మార్చి 20, 21వ తేదీల్లో విఐపి బ్రేక్ దర్శనాలకు ఎలాంటి సిఫార్సు లేఖలు స్వీకరించరని స్పష్టం చేసారు. భక్తులు టీటీడీ తీసుకున్న నిర్ణయం మేరక సహకరించాలని అధికారులు కోరుతున్నారు. ప్రస్తుతం తిరుమలలో రద్దీ సాధారణంగా ఉంది. రానున్న రోజుల్లో పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

కోదండరామస్వామి బ్రహ్మోత్సవాలు
ఇక..ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి బ్రహ్మోత్సవాల నిర్వహణకు టీటీడీ సిద్దమైంది. ఈవో ధర్మారెడ్డి ఏర్పాట్లను పర్యవేక్షించారు. మార్చి 30వ తేదీ శ్రీరామనవమితో స్వామివారి బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయన్నారు. ఏప్రిల్ 3వ తేదీ హనుమంత వాహనం, ఏప్రిల్ 4వ తేదీ గరుడవాహనం, ఏప్రిల్ 5వ తేదీ సీతారాముల కల్యాణాన్ని అత్యంత అద్భుతంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. శ్రీ సీతారాముల కల్యాణానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి జగన్ పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పిస్తారని వెల్లడించారు. ఏప్రిల్ 6న రథోత్సవము, ఏప్రిల్ 8న చక్రస్నానం, ఏప్రిల్ 9న పుష్పయాగము జరుగుతాయని ఈవో ధర్మారెడ్డి వెల్లడించారు.-
రేపే తిరుచానూర్ ఆలయంలో.. !! -
పంచె కట్టులో మెరిసిన జగన్, సతీ సమేతంగా ఉగాది వేడుకలు -
ఆ అదృష్టం - బాధ్యత నాదే, ఉగాది వేళ చంద్రబాబు కీలక ప్రకటన..!! -
సీఎం తొలి సంతకం.. పేదల కోసం వరాల ఉగాది! -
తెలుగు ప్రజలకు సీఎం చంద్రబాబు, రేవంత్రెడ్డి "ఉగాది" స్పెషల్ విషెస్ !!! -
సీఎం రేవంత్ రెడ్డి జాతకం చూశారా? ఇక ప్రత్యర్థులకు చుక్కలే! -
ఉగాది రోజు బంగారం కొంటే ఐశ్వర్యమే! తగ్గిన ధరలతో రెట్టింపు లాభం! -
అసలైన షడ్రుచుల ఉగాది పచ్చడి.. ఇలా చేస్తే టేస్ట్ తో పాటు..! -
అమావాస్య ఘడియతో ఉగాది ఆరంభం? -
ఇక ఒక్క మిస్డ్ కాల్తో గ్యాస్ బుకింగ్: కొత్త నంబర్లు ఇవే! -
ఏప్రిల్ నెలలో మేషరాశి, వృషభ రాశి జాతక ఫలం -
బంగారం ధరలకు పూర్వవైభవం- పరుగులు









Click it and Unblock the Notifications