ముద్రగడ దీక్ష ఫలితం: తుని కేసులో అందరికీ బెయిల్
రాజమహేంద్రవరం: కాపు గర్జన సమయంలో జరిగిన తుని విధ్వంసం కేసులో అరెస్టైన మరో ముగ్గురికి పిఠాపురం అదనపు జిల్లా న్యాయస్థానం సోమవారం నాడు బెయిల్ మంజూరు చేసింది. దీంతో, ఈ కేసులో అరెస్టైన అందరికీ బెయిల్ వచ్చినట్లయింది.
తుని విధ్వంసం ఘటనలో మొత్తం పదమూడు మందిని పోలీసులు అరెస్టు చేశారు. మూడు రోజుల క్రితం పదిమందికి న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది. ఈ రోజు మిగతా వారికి బెయిల్ రావడం గమనార్హం.

కాపు నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం వీరిని విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ దీక్ష చేస్తున్న విషయం తెలిసిందే. అందరికీ బెయిల్ రావడంతో ఆయన దీక్ష విరమించే అవకాశాలు ఉన్నాయి. పదిమందికి బెయిల్ వచ్చినప్పుడు ఆయన దీక్ష విరమించలేదు. అందరికీ బెయిల్ వస్తేనే తాను దీక్ష విరమిస్తానని ప్రకటించారు.












Click it and Unblock the Notifications