తండ్రీకూతుళ్ల మధ్య టీవీ చిచ్చు: అల్లుడికి కత్తిపోట్లు
హైదరాబాద్: టీవీ ఓ కుటుంబంలో చిచ్చు పెట్టింది. క్షణికావేశం ఎంత దారుణానికైనా తెగబడేలా చేస్తుందనే దానికి హైదరాబాద్లో తాజాగా జరిగిన ఒక సంఘటనే కారణం. టీవీ చానెల్స్ చూసే విషయంలో తండ్రీ కూతురు మధ్య ఏర్పడిన గొడవ.. చివరకు అల్లుడి కత్తిపోట్లకు దారితీసింది. హైదరాబాద్ శారదానగర్లో ఈ గొడవ చోటు చేసుకుంది.
శారదానగర్కు చెందిన మైఖేల్ అనే 60 ఏళ్ల వ్యక్తి తన కుమార్తె, అల్లుడితో కలిసి నివాసం ఉంటన్నాడు. మంగళవారం మధ్యాహ్నం మైఖేల్ కూతురు మరియా థెరిస్సాతో కలిసి టీవీ చూస్తున్నారు. ఈ క్రమంలోనే, వారిద్దరి నడుమ ఏ చానల్ చూడాలన్న విషయమై తగాదా వచ్చింది.
తండ్రీకూతుళ్ల మధ్య గొడవ పెద్దదవుతుండడంతో, అల్లుడు సత్యశ్రీనివాస్ కలుగజేసుకుని వారించబోయాడు. దీంతో ఆగ్రహించిన మైఖేల్ వంట గదిలో ఉన్న కూరగాయలు కోసే కత్తితో తన సొంత అల్లుడి మీద దాడి చేశాడు. ఈ సంఘటనలో సత్యశ్రీనివాస్ కు తీవ్రగాయాలయ్యాయి.
ప్రస్తుతం అతను ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. వీటి మాయలో పడి మనిషి ఒక్కోసారి తనకున్న విచక్షణను, ఆలోచనను, వివేచనను కూడా కోల్పోతున్నాడు.