అఖిలప్రియకు షాక్: నాకు అండగా ఉండు... సోదరుడి వద్దకు శిల్పా మోహన్ రెడ్డి
కర్నూలు జిల్లా నంద్యాల ఉప ఎన్నికల్లో కొత్త ట్విస్ట్. ఉప ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన నేపథ్యంలో రాజకీయ వేడి మరింత రాజుకుంది.
నంద్యాల: కర్నూలు జిల్లా నంద్యాల ఉప ఎన్నికల్లో కొత్త ట్విస్ట్. ఉప ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన నేపథ్యంలో రాజకీయ వేడి మరింత రాజుకుంది.
వైసిపి ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా మోహన్ రెడ్డి తన సోదరుడు శిల్పా చక్రపాణి రెడ్డిని నంద్యాలలో కలిశారు. ఉప ఎన్నికల్లో మద్దతు కోరారు.

అన్నదమ్ముల భేటీపై ఆసక్తి
శిల్పా సోదరులు ఇటీవలి వరకు ఒకే పార్టీలో ఉన్నారు. నంద్యాల ఉప ఎన్నికల్లో తనకు టిక్కెట్ ఇవ్వకపోవడంతో శిల్పా మోహన్ రెడ్డి వైసిపిలో చేరి, టిక్కెట్ దక్కించుకున్నారు. నంద్యాల నుంచి భూమా కుటుంబం నుంచి భూమా బ్రహ్మానంద రెడ్డి పోటీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అన్నదమ్ముల కలయికపై సర్వత్రా ఆసక్తి కనిపించింది.
Recommended Video


చక్రపాణి మద్దతుపై అనుమానాలు?
టిక్కెట్ ఇవ్వకపోవడంతో శిల్పా మోహన్ రెడ్డి వైసిపిలో చేరారు. శిల్పా చక్రపాణి టిడిపిలోనే కొనసాగుతున్నప్పటికీ ఆయన ఎవరికి మద్దతు పలుకుతారనే చర్చ అంతటా సాగుతోంది. వైసిపిలో ఉన్న సోదరుడు మోహన్ రెడ్డికా, లేక పార్టీలో ఉన్నప్పటికీ చిరకాల రాజకీయ ప్రత్యర్థి భూమా వర్గానికి మద్దతు పలుకుతారా అనే చర్చ సాగుతోంది.

అఖిలప్రియ ఉద్దేశ్యపూర్కంగానే దూరం పెడుతోందా?
మంత్రి అఖిలప్రియ, భూమా కుటుంబం చక్రపాణి రెడ్డిని ఉద్దేశ్య పూర్వకంగానే దూరం పెడుతోందని ఆయన భావిస్తున్నారని తెలుస్తోంది. ఇటీవలే మంత్రులు కూడా మాట్లాడారు. చక్రపాణి రెడ్డి తానే ప్రచారానికి దూరం ఉంటున్నారని, తాను ఏం చేసినా విపక్షాలు ఇష్టారీతిగా ప్రచారం చేస్తాయనే దూరం పాటిస్తున్నానని తమకు చెప్పారని, ఆయన మద్దతు భూమా కుటుంబానికే అని చెప్పారు.

లోపల జరుగుతోంది మరొకటి.. టిడిపిలో చేరుతారా?
కానీ లోపల జరుగుతున్న పరిస్థితి మాత్రం అలా కనిపించడం లేదంటున్నారు. ఇప్పటికే మండలి చైర్మన్ పదవి మిస్ అయింది. ఇప్పుడు అఖిల కూడా దూరం పెడుతుండటంతో ఆయన మరింత ఆవేదనగా ఉన్నారని చెబుతున్నారు. సోదరుడు మోహన్ రెడ్డి దారిలోనే శిల్పా చక్రపాణి రెడ్డి కూడా వైసిపిలో చేరినా ఆశ్చర్యం లేదంటున్నారు. ఆగస్ట్ 3న జగన్ నంద్యాలలో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో శిల్పా సోదరుల భేటీపై చర్చనీయాంశమైంది.
-
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
విశాఖపట్నం నుంచి అరుణాచలం, కాంచీపురం, మహాబలిపురం స్పెషల్ ట్రైన్.. హాల్ట్ స్టేషన్లు !! -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
పెళ్లి కాకపోయి ఉంటే ఆ హీరోతో డేటింగ్ చేస్తా - అనసూయ -
ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీని కదిలిస్తుంది ఈ సినిమా! -
రైతు భరోసా అమలులో కీలక మార్పులు, ఇక వారికీ వర్తింపు - నిధుల జమ ముహూర్తం..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
పచ్చని చెట్ల మధ్య దాగి ఉన్న తెల్లపామును చూశారా..? -
రైలు బయల్దేరే ముందు ఎక్కే స్టేషన్ మార్పు..! రైల్వే కొత్త రూల్..! -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు -
డబ్బింగ్ సినిమాతో తమిళంలో రజనీకాంత్ రికార్డులను బద్ధలు కొట్టిన రాజశేఖర్












Click it and Unblock the Notifications