ఇద్దరు అమ్మాయిల అదృశ్యం ... ఓ వ్యక్తి ఆత్మహాత్య
ప్రకాశం :ఇద్దరు బాలికలు అదృశ్యమైన ఘటన ఓ వ్యక్తి మరణానికి కారణమైంది. ఈ బాలికల అదృశ్యానికి తనకు సంబందం లేదనే నిరూపించుకోలేక ఆయన పురుగులమందు తాగి ఆత్మహాత్యకు పాల్పడ్డారు.
ప్రకాశం జిల్లా కుందంపల్లికి చెందిన ఇద్దరు బాలికలు అదృశ్యమయ్యారు.ఈ ఘటన అక్టోబర్ 12వ,తేదిన జరిగింది. ఈ ఘటన జరిగిన నాటి నుండి గ్రామంలో కుల పెద్దలు పంచాయితీ నిర్వహించారు.ఇద్దరు బాలికల అదృశ్యానికి అదే గ్రామానికి చెందిన రాజయ్య కుమారుడే కారణమని పంచాయితీలో నిందించారు.

బాలికల అదృశ్యం విషయమై తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.కుల పంచాయితీ లో నిందను మోపడంతో ఆ నింద నుండి తప్పించుకొనేందుకుగాను ఏం చేయాలో రాజయ్యకు అర్థం కాలేదు. మహాబూబ్ నగర్ జిల్లా అచ్చంపేట మండలంలో ఉన్న మంత్రగత్తె వద్దకు వెళ్తే మంత్రగత్తె రాజయ్య చేయి పట్టుకొంది.దీంతో రాజయ్యను బాలికల బందువలు వేదించారు. తమ పిల్లల ఆచూకీ తెలపాలంటూ ఇంటిపైకి వచ్చారు.
అమ్మాయిల బందువుల ఒత్తిడి ఎక్కువ కావడంతో రాజయ్య నవంబర్ 1వ, తేదిన పురుగుల మందు తాగి ఆత్మహాత్యయత్నం చేశాడు. ఎర్రగొండపాలెం పభుత్వ ఆసుపత్రిలో చికత్స పొందుతూ గురువారం నాడు ఆయన మరణించాడు. రాజయ్య కొడుకు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
-
ఉచిత విద్యుత్, రూ. 25,000 ప్రసూతి సాయం: ఎక్కడ కొట్టాలో అక్కడ కొట్టిన విజయ్ -
today rashiphalalu: నేడు అద్భుత రాజయోగంతో పండుగ చేసుకునే రాశులు ఇవే -
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
పదో తరగతి పరీక్షల్లో పొరపాట్లు, ఆ రెండు సబ్జెక్టుల్లో మార్కుల యాడింగ్..ఇలా..!! -
కేంద్రం బ్రహ్మాస్త్రం: రూ. 2.5 లక్షల కోట్ల భారీ పథకం -
అల్లు అర్జున్-అట్లీ మూవీ టైటిల్ లీక్?.. నెట్టింట రచ్చ! -
చుక్కలు చూపుతున్న పసిడి రేట్లు -
ఎవరైనా ఇలా చేస్తే అమరావతి చట్టబద్ధత రద్దవుతుంది: బాంబు పేల్చిన సాయిరెడ్డి -
ఇరాన్ కు సపోర్ట్ చేస్తావా..? పాకిస్థాన్ ను కోలుకోలేని దెబ్బ కొట్టిన యూఏఈ.. -
తిరుమల, అలిపిరిల్లో చిరుతలను గుర్తించడానికి టీటీడీ కొత్త టెక్నాలజీ -
No Stock: ధర చూస్తే గుండె గుభేల్! డ్రైవర్ల కన్నీటి గాథ! -
గ్యాస్ కష్టాలకు చెక్, ఇలా చేస్తే వెంటనే మీ ముందుకే సిలిండర్..!!












Click it and Unblock the Notifications