పోలీసుల కళ్లుగప్పి...పరారైన రాజమండ్రి సెంట్రల్ జైలు రిమాండ్ ఖైదీలు
రాజమండ్రి: పట్టణంలోని సెంట్రల్ జైలు నుంచి ఇద్దరు రిమాండ్ ఖైదీలు పరారయ్యారు. ఖైదీలను జైలు నుంచి మరో చోటికి తరలిస్తుండగా పోలీసుల కళ్లుగప్పి పారిపోయారు.
లావేటి తల్లిబాబు, నూకరాజు అనే ఇద్దరు ఖైదీలను కేసు విచారణ నిమిత్తం రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి నర్సీపట్నం తీసుకెళ్లడానికి పోలీసులు నిశ్చయించారు. ఇందులో భాగంగా బుధవారం వాహనం సిద్దం చేసి వారిద్దరితో నర్సీపట్నం బయల్దేరారు. అయితే దారిమధ్యలోనే ఇద్దరు రిమాండ్ ఖైదీలు ఒక్కసారిగా పోలీసుల కళ్లుగప్పి పరారయ్యారు. ఈ విషయమై రాజానగరం పీఎస్లో కేసు నమోదు అయింది.

అయితే జరిగిన ఘటనపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. పోలీసులపై ఎటువంటి దాడికి పాల్పడకుండా...ఎలాంటి ప్రతిఘటన లేకుండా ఖైదీలు ఎలా పారిపోగలిగారనే విషయం సందేహాలకు తావిస్తోంది. అయితే పోలీసులు కేసు నమోదు చేసుకోవడంతో లోతుగా విచారణ జరిపితే అన్ని విషయాలు బైటకు వస్తాయని భావిస్తున్నారు. అయితే పారిపోయిన ఖైదీలు తీవ్ర నేరారోపణలతో జైలుకు వచ్చినందున వారిని పట్టుకునే విషయమై పోలీసులు తీవ్ర స్థాయిలో గాలింపు జరుపుతున్నట్లు తెలిసింది.
-
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే! -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి?












Click it and Unblock the Notifications