జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన ఉభయగోదావరి జిల్లాల సీనియర్ నేతలు
ఉభయగోదావరి జిల్లాలకు చెందిన ఇద్దరు సీనియర్ నేతలు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.
హైదరాబాద్: ఉభయగోదావరి జిల్లాలకు చెందిన ఇద్దరు సీనియర్ నేతలు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. తూర్పుగోదావరి జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ మాజీ ఛైర్మన్ ఆకాసం శ్రీరామచంద్రమూర్తి సోమవారం లోటస్ పాండ్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో ఆ పార్టీలో చేరారు.
రామచంద్రమూర్తికి పార్టీ కండువా వేసిన జగన్.. ఆయనను సాదారంగా ఆహ్వానించారు. ఆయన వెంట పార్టీ జిల్లా అధ్యక్షుడు కరసాల కన్నబాబు, ఎమ్మెల్సీ పిల్లి సుభాష్ చంద్రబోస్, ముమ్మడివరం సమన్వయకర్త పితాని బాలకృష్ణ, కాకినాడ పార్లమెంటరీ కో-ఆర్డినేటర్ చలమలశెట్టి సునీల్ తదితరులు ఉన్నారు.

ఇది ఇలా ఉండగా, పశ్చిమగోదావరి జిల్లా ఉండి నియోజకవర్గానికి చెందిన పీవీఎల్ నరసింహరాజు కూడా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయనకు పార్టీ కండువా వేసి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఆళ్ల నాని, రాజ్యసభసభ్యుడు విజయసాయిరెడ్డి, పార్టీ నేతలు పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications