ఆధార్ అప్డేట్ సేవల్లో మార్పులు, కొత్త ఛార్జీలు..!!
ఆధార్ సేవల్లో కొత్త మార్పులు వచ్చాయి. ఇప్పటికే ఆధార్ అప్డేట్ కోసం యాప్ ద్వారా చేసుకునే వెసులుబాటు అందుబాటులోకి వచ్చింది. ఇప్పుడు కొత్తగా ఆధార్ అప్డేట్ కోసం కొత్త ఫీజులను ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా ఖరారు చేసింది. ఛార్జీలను పెంచింది. పెరిగిన ఛార్జీలు అమల్లోకి వచ్చాయి. ఏ సేవకు ఎంత చెల్లించాలో ఇప్పటికే ఖరారు చేసింది. దీంతో, కొత్త ధరల మేరకు ఆధార్ అప్డేట్.. సేవలు కొనసాగుతున్నాయి.
యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆధార్ అప్డేట్ ఛార్జీలను పెంచింది. కొత్త ధరలు అక్టోబర్ 1, 2025 నుంచి అమలులోకి వచ్చాయి. ఈ ధరలు సెప్టెంబర్ 30, 2028 వరకు అమలులో ఉంటాయి. వ్యక్తిగత వివరాల అప్డేట్ కోసం ఇప్పటి వరకు రూ.50 మాత్రమే ఉండేది. అయితే, ఇప్పుడు రూ 75 కి పెరిగింది. వేలిముద్రలు, కంటి స్కాన్ (ఐరిస్) లేదా ఫొటో వంటి బయోమెట్రిక్ వివరాలను అప్డేట్ చేయడానికి ఇప్పుడు రూ.125 చెల్లించాలి.

2028 అక్టోబర్ నుంచి ఈ ఫీజు రూ.150కి పెరుగుతుంది. గుర్తింపు లేదా చిరునామా రుజువు డాక్యుమెంట్ల ను అప్డేట్ చేయడానికి కొన్ని అవకాశాలు ఉన్నాయి. మై ఆధార్ పోర్టల్లో జూన్ 14, 2026 వరకు ఈ అప్డేట్లు ఉచితం. అంటే ఆన్లైన్లో డాక్యుమెంట్లను అప్లోడ్ చేస్తే ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. ఎన్రోల్మెంట్ కేంద్రాలలో మీ డాక్యుమెంట్ అప్డేట్కు రూ. 75 చెల్లించాలని వెల్లడించింది.
అదే వింగా ఆధార్ కార్డు ప్రింటౌట్ తీసుకోవడానికి లేదా ఈ-కేవైసీ ద్వారా వివరాలను పొందడానికి ఇప్పుడు రూ.40 చెల్లించాలి. రెండో దశలో (2028 అక్టోబర్ నుంచి) ఈ ఫీజు రూ.50కి పెరుగుతుంది. పిల్లల ఆధార్ వివరాలను సకాలంలో అప్డేట్ చేయడాన్ని ప్రోత్సహించడానికి UIDAI కొన్ని ఫీజులను మాఫీ చేసింది. 5-7 సంవత్సరాలు & 15-17 సంవత్సరాల వయస్సు గల పిల్లలకు మొదటి బయోమెట్రిక్ అప్డేట్ ఉచితమని వెల్లడించారు.
ఇక..7-15 సంవత్సరా ల వయస్సు వారికి బయోమెట్రిక్ అప్డేట్కు రూ.125 ఫీజు ఉంటుంది. కానీ 2026 సెప్టెంబర్ 30 వరకు ఈ ఫీజు మాఫీ చేసారు. హోమ్ ఎన్రోల్మెంట్ కోసం రూ.700 (GSTతో సహా) చెల్లించాలి. ఒకే చిరునామాలో ఒకరి కంటే ఎక్కువ మంది ఈ సేవను ఉపయోగించినట్లయితే, అదనపు వ్యక్తికి రూ.350 చెల్లించాలి.
-
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్తో ఛాన్స్ కొట్టేసింది! -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
H-1B Visa: హెచ్1బీ లాటరీ నోటీసుల విడుదల-స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
ఏప్రిల్ లో బ్యాంకులకు వరుస హాలిడేస్ - స్కూళ్లకు వేసవి సెలవులపై తాజా ఉత్తర్వులు..!! -
ఇరాన్కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
బంగారం ధరలు తలకిందులు












Click it and Unblock the Notifications