అమరావతిలో లాండ్ పూలింగ్ కు ఇవ్వని రైతుల పై కీలక నిర్ణయం..!!
అమరావతి కేంద్రంగా కీలక నిర్ణయాలు జరగుతున్నాయి. రైతుల సమస్యల పరిష్కారం పైన ప్రభుత్వం ప్రత్యేకంగా ఫోకస్ చేసింది. రెండో విడత లాండ్ పూలింగ్ కు నిర్ణయం తరువాత త్రిసభ కమిటీ వరుసగా సమావేశాలు నిర్వహిస్తోంది. రైతుల పెండింగ్ అంశాల పరిష్కారం పైన కసరత్తు చేస్తోంది. అటు అమరావతిలో లాండ్ పూలింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. కాగా.. లాండ్ పూలింగ్ కు ముందుకు రాని రైతుల విషయంలో ఏం చేయాలనే అంశం పైన త్రిసభ్య కమిటీ చర్చించింది. కీలక నిర్ణయం తీసుకుంది.
అమరావతిలో రైతుల సమస్యల పరిష్కారం పైన ప్రభుత్వం నియమించిన త్రిసభ్య కమిటీ వేగంగా నిర్ణయాలు తీసుకుంటోంది. రాజధానిలో లంక భూముల ఇష్యూ క్లియర్ అయ్యిందని కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ చెప్పారు. రాయపూడి సీఆర్డీయే కార్యాలయంలో త్రిసభ్య కమిటీ సమావేశమైంది. భూములిచ్చిన రైతుల సమస్యల పరిష్కారంపై చర్చించారు. గ్రీన్ బఫర్ జోన్ తుళ్ళూరులో అడిగారని.. దీని వల్ల 36 ఫ్లాట్లు ఎఫెక్ట్ అవుతుండగా దాన్ని 3 కు తగ్గించినట్లు పెమ్మసాని చెప్పారు.

2004 మంది రైతులు ల్యాండ్ పూలింగ్కు ఇవ్వలేదని... వారితో మరోసారి మాట్లాడతామని తెలిపారు. 120 మంది రైతులు ల్యాండ్ ఆల్టర్నేటివ్ అయినా కూడా తీసుకుంటా మని అన్నారని చెప్పారు. రోడ్డు శూల ఉన్న భూములకు వాక్ వేలు సరి చేస్తామన్నారు. వాస్తు అనేది ఎండ్ లెస్ అని.. మొదట్లో వాస్తు ప్రకారం చేశారని.. ప్రతీసారి వాస్తు విషయం చూడలేమని స్పష్టం చేశారు.
ఎఫ్ఎస్ఐ తక్కువ ఉందని రైతులు అంటున్నారని.. దీనిపై పునరాలోచన చేయాలని భావిస్తున్నా మ ని తెలిపారు. అవకాశం ఉంటే మాత్రమే చేస్తామని పెమ్మసాని స్పష్టం చేశారు. 26 గ్రామాల్లో డీపీఆర్ చేసి ఇస్తామని చెప్పామని.. బౌండరీ స్టోన్స్లను సోమవారం నుంచి రెండు వైపులా వేయనున్నట్లు తెలిపారు. సోషల్ ఇన్ఫ్రాస్టక్చర్ కింద 18 కమ్యూనిటీ హాల్లు కావాలన్నారని, స్మశానాల విషయంలో మంత్రి నారాయణ, ఎమ్మెల్యే శ్రవణ్ కుమార్ కూర్చుని చర్చిస్తారని కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పేర్కొన్నారు.
సోమవారం తరువాత గ్రామాల్లో సమావేశాలు పెట్టి సోషల్ ఇన్ఫ్రాస్టక్చర్లపై, గ్రామ అభివృద్ధి ప్లాన్ ల పై చర్చించాలని సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు ఎమ్మెల్యే శ్రవణ్ కుమార్ తెలిపారు. అసైన్డ్ ల్యాండ్ విషయంలో ఉన్న సమస్యలను కూడా న్యాయపరమైన చిక్కులు తొలిగాక సరిచేస్తామని చెప్పారు.
-
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
అసెంబ్లీ తీర్మానం వేళ 'అమరావతి'పై తేల్చేసిన జగన్, గతం గతః- సంచలన ప్రకటన..!! -
అమరావతి ఇక నుంచి.. ఏపీ కేబినెట్ సంచలన తీర్మానం..!! -
అమరావతిలో నిర్మాణాల వేళ 'మాస్టర్ ప్లాన్', కీలక మలుపు..!! -
14కు మార్కాపురం బస్సు ప్రమాద మృతులు.. ఎక్స్ గ్రేషియా ప్రకటించిన సీఎం చంద్రబాబు! -
ఈ ప్రాంతాల్లో వంట గ్యాస్ సరఫరా పై ప్రభుత్వం కీలక నిర్ణయం, ఇక నుంచి..!! -
మార్కాపురం ప్రమాద ఘటన: చంద్రబాబు దృష్టికి ప్రమాద కారణం, సీఎం రేవంత్ దిగ్భ్రాంతి! -
విద్యుత్ ఛార్జీల పై ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, ఇక కొత్తగా..!! -
Amaravati: పీఎంవో అత్యవసర ఆదేశాలు-28న ఏపీ అసెంబ్లీ ప్రత్యేక భేటీ..! -
పోలవరం ప్రాజెక్ట్ పై కేంద్రానికి మంత్రి విన్నపాలు! -
ఇకపై రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్












Click it and Unblock the Notifications