నన్ను అలా అంటారా!: రైల్వే జోన్పై పీయూష్ గోయెల్ క్లారిటీ, బాబుకు కౌంటర్
న్యూఢిల్లీ: విశాఖపట్నం రైల్వే జోన్ అంశంపై కేంద్రమంత్రి పీయూష్ గోయల్ గురువారం స్పందించారు. అలాగే, తెలుగుదేశం పార్టీలకు అపాయింటుమెంట్ ఇవ్వలేదనే విమర్శల పైన కూడా గట్టి కౌంటర్ ఇచ్చారు.
ఏపీకి రైల్వే జోన్ అంశం కేంద్రం పరిశీలనలో ఉందని చెప్పారు. సంబంధిత అధికారులతో తాము సంప్రదింపులు జరుపుతున్నామని తెలిపారు. చర్చల అనంతరం తుది నిర్ణయం వెల్లడిస్తామని ఆయన తెలిపారు.

టీడీపీ ఎంపీలను కలవలేదనడం సరికాదు
తాను తెలుగుదేశం పార్టీ ఎంపీలను ఉద్దేశ్యపూర్వకంగా కలవలేదని చెప్పడం సరికాదని పీయూష్ గోయల్ అన్నారు. రెండు రోజుల క్రితం వైసీపీ ఎంపీకి అపాయింటుమెంట్ ఇచ్చిన పీయూష్.. టీడీపీ ఎంపీలకు మాత్రం ఇవ్వలేదని వార్తలు వచ్చాయి.

చంద్రబాబు నాయుడు కూడా ఆగ్రహం
వైసీపీకి ఇచ్చి టీడీపీ ఎంపీలకు అపాయింటుమెంట్ ఇవ్వకపోవడంపై సీఎం చంద్రబాబు నాయుడు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు మిత్రపక్షం వైసీపీయా, మేమా అని టీడీపీ అంతర్గత భేటీలో మాట్లాడారు. ఈ నేపథ్యంలో పీయూష్ గట్టి కౌంటర్ ఇచ్చారు.

నన్ను ఆ రోజు ఎప్పుడైనా కలవొచ్చు
తాను ఎంపీలను ఉద్దేశ్యపూర్వకంగా కలవలేదని చెప్పడం సరికాదని గోయెల్ చెప్పారు. ప్రతి మంగళవారం సాయంత్రం నాలుగు గంటల నుంచి ఆరు గంటల వరకు ఏ ఎంపీ అయినా తనను కలవవచ్చునని చెప్పారు. అలాంటప్పుడు తాను వారిని కలవలేదనడం సరికాదన్నారు.

చట్టంలో అలా పెట్టి రాజకీయం
విశాఖ రైల్వే జోన్ అంశాన్ని కాంగ్రెస్ పార్టీ రాజకీయం చేస్తోందని గోయల్ మండిపడ్డారు. రైల్వే జోన్ అంశాన్ని పరిశీలించాలని మాత్రమే నాటి యూపీఏ ప్రభుత్వం చట్టంలో పెట్టిందని తెలిపారు. ఇది తమ పరిశీలనలో ఉందన్నారు. ఆర్థిక, సాంకేతిక అంశాలపై కమిటీ అధ్యయనం చేస్తోందన్నారు. రైల్వే జోన్ కూడా రాదని ఇటీవల వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన క్లారిటీ ఇచ్చారు.
-
కుటుంబ సమేతంగా తిరుమలకు చేరుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు.. -
కనిపించిన నెలవంక.. దేశవ్యాప్తంగా "రంజాన్" వేడుకలకు వేళాయే !! -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
విడాకులపై మెగా డాటర్ "నిహారిక" కామెంట్స్.. అసలు కాంటాక్ట్ కూడా లేదు ?? -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!!












Click it and Unblock the Notifications