సత్యం రామలింగరాజు గ్రామంలో ఇంతదారుణమా?: బాబుపై వీహెచ్ ఫైర్
హైదరాబాద్: పశ్చిమగోదావరి జిల్లా గరగపర్రు సాంఘిక బహిష్కరణ విషయంపై మాజీ ఎంపీ, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు వీ హనుమంతరావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గరగపర్రు పరిస్థితులను ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వెంటనే చక్కదిద్దాలని డిమాండ్ చేశారు.
Recommended Video

లేదంటే కాంగ్రెస్ ఉపాధ్యాక్షుడు రాహుల్ గాంధీని తీసుకువచ్చి అక్కడి దళితులకు న్యాయం జరిగేలా పోరాటం చేస్తామని చెప్పారు. సాఫ్ట్వేర్ రంగంలో ఎంతో పేరుగాంచిన సత్యం రామలింగరాజు సొంత గ్రామంలోనే దళితులను వెలివేయడం దారుణమని అన్నారు.

ఇంత అన్యాయం జరుగుతుంటే చంద్రబాబు ప్రభుత్వం ఏం చేస్తోందని వీహెచ్ ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్లో ఇంటెలిజెన్స్ విభాగం పనిచేస్తుందా? చంద్రబాబు భజన చేస్తోందా? అని విమర్శించారు.
తాను గరగపర్రు వెళ్లి దళితులతో మాట్లాడానని, వారికి కనీసం తిండి లేక నానా అవస్థలు పడుతున్నారని వీహెచ్ తెలిపారు. తన సొంత ఖర్చులతో ఇవాళ బియ్యం తదితర నిత్యావసర వస్తువులను పంపుతున్నట్లు వీ హనుమంతరావు తెలిపారు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications