చంద్రబాబుకు హెచ్చరిక: 'హెరిటేజ్ ఇష్యూ కాదు, తేడా వస్తే సింగపూర్ వెళ్లాలి'
అమరావతి: నవ్యాంధ్ర రాజధాని అమరావతి కోసం సింగపూర్ కంపెనీలతో చేసుకున్న ఒప్పందాల వివరాలను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెల్లడించాలని మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వర రావు సోమవారం డిమాండ్ చేశారు. ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ టీడీపీ జాతీయ అధ్యక్షుడిపై తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగారు.
వేల కోట్ల విలువైన రాజధాని భూములను బలవంతంగా రైతుల నుంచి లాక్కొని అప్పనంగా సింగపూర్ కంపెనీలకు చంద్రబాబు దోచిపెడుతున్నారని తీవ్ర ఆరోపణలు చేసారు. ముఖ్యమంత్రికి ఆ భూములపై అంత మక్కువ ఎందుకు అని ప్రశ్నించారు. ఇందులో ఏదో ఉందని సందేహం వ్యక్తం చేశారు. సింగపూర్, ఏపీ ప్రభుత్వం మధ్య ఏం ఒప్పందం జరిగిందో చెప్పాలన్నారు.

చీకటి ఒప్పందం ఏమిటో చెప్పాలి
రాష్ట్ర ప్రభుత్వానికి, సింగపూర్ కంపెనీలకు జరిగిన చీకటి ఒప్పందం ఏమిటో చెప్పాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి చంద్రబాబుపై ఉందని వడ్డే శోభనాద్రీశ్వర రావు అన్నారు. ఆ కంపెనీలతో జరిగిన ఒప్పందాన్ని రహస్యంగా ఉంచేందుకు ఇది చంద్రబాబుకు చెందిన హెరిటేజ్ సంస్థ వ్యవహారం కాదని చెప్పారు.

అది హెరిటేజ్ వ్యవహారం కాదు
అమరావతి భూములు, సింగపూర్ కంపెనీలతో ఒప్పందం అంతా ప్రజలకు సంబంధించిన వ్యవహారమని వడ్డే శోభనాద్రీశ్వర రావు అన్నారు. దీనిపై ప్రజలకు కచ్చితమైన సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఏడాది క్రితం సింగపూర్ సంస్థలతో చేసుకున్న ఒప్పందాలు ఇప్పటి వరకు కూడా అమలుకు నోచుకోలేదని మండిపడ్డారు.

తేడా వస్తే బాధ్యతలు ఎవరు తీసుకుంటారు
ఇప్పుడు మళ్లీ వేరే కంపెనీలతో ఒప్పందం చేసుకుంటున్నారని తెలుస్తోందని వడ్డే అన్నారు. గతంలో చేసుకున్న ఒప్పందాల సంగతి ఏమయిందో చెప్పాలన్నారు. ఒప్పందాల్లో తేడాలు వస్తే ఎవరు బాధ్యత తీసుకుంటారని ప్రశ్నించారు. పైగా సింగపూర్ కంపెనీలకు భారత చట్టాలు వర్తించవని ఆయన గుర్తు చేశారు.

తేడా వస్తే సింగపూర్ వెళ్లవలసిందే
ఒప్పందాల విషయంలో ఏవైనా తేడాలు వస్తే అప్పుడు సింగపూర్ వెళ్లవలసిందేనని వడ్డే శోభనాద్రీశ్వర రావు హెచ్చరించారు. ప్రజల సొమ్మును ఇష్టం వచ్చినట్లు, ఇష్టం వచ్చిన వారికి, నచ్చిన వారికి దోచిపెడితే చూస్తూ ఊరుకునేది లేదని ఆయన వార్నింగ్ ఇచ్చారు.
-
హైదరాబాద్ ను మించి అమరావతి నిర్మాణం చేస్తామన్న సీఎం చంద్రబాబు! -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల..












Click it and Unblock the Notifications