వందే భారత్ కు పోటీగా వస్తున్న రైళ్లు
అత్యాధునిక సౌకర్యాలతో ఎక్కువ దూరాన్ని తక్కువ సమయంలో చేరుకునేలా భారతీయ రైల్వే వందే భారత్ రైళ్లను ప్రవేశపెడుతున్న సంగతి తెలిసిందే. దేశంలోని ప్రధాన నగరాల మధ్య ప్రయాణించే దూరం తక్కువగా ఉండాలన్నదే ఈ రైళ్ల తయారీ వెనక ఉన్న ఉద్దేశం. అయితే ఛార్జీలు ఎక్కువగా ఉండటంతో మొదట్లో ఉన్నంత ఆదరణ తర్వాత ఉండటంలేదు. వందేభారత్ సగటు వేగం కేవలం 83 కిలోమీటర్లే ఉంటోంది.
వందే భారత్ కన్నా దేశ రాజధానికి ప్రయాణం చేస్తే సూపర్ ఫాస్ట్ రైళ్లు వేగంగా వెళతాయనే అభిప్రాయంలో ప్రయాణికులున్నారు. ఇతర రైళ్లతో పోలిస్తే ఈ వేగంతో గమ్యానికి అనుకున్న సమయంకన్నా ముందుగా ఏమీ చేరుకోవడంలేదని, 40 నిముషాల నుంచి గంటలోపే తేడా ఉంటోందని.. దీనికి అంత డబ్బులు పోసి టికెట్లు కొనుగోలు చేయడం వృథా అనే భావనకు ప్రయాణికులు వచ్చేశారు.

దీంతో భారతీయ రైల్వే కొత్తగా వందే సాధారణ్ రైళ్లను పరిచయం చేయబోతోంది. గతంలో శతాబ్ది రైళ్లు వచ్చినప్పుడు కూడా ఛార్జీలు ఎక్కువగా ఉన్నాయనే ఫిర్యాదు రావడంతో జన శతాబ్దిని ప్రవేశపెట్టారు. వీటిల్లో సాధారణ ఛార్జీలే ఉంటాయి. అలాగే వందే భారత్ ఛార్జీలు ఎక్కువగా ఉన్నాయంటూ విమర్శలు రావడంతో వందే సాధారణ్ రైళ్లను ప్రవేశపెట్టబోతోంది.
చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ ఈ రైలు కోచ్లు తయారవుతున్నాయి. 24 ఎల్హెచ్బీ కోచ్లను వందే సాధారణ్ లో ఏర్పాటు చేయనున్నారు. బయో వాక్యూమ్ టాయిలెట్స్, ప్యాసింజర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్, ఛార్జింగ్ పాయింట్స్, సీసీ కెమెరాలు, ఆటోమేటిక్ డోర్ సిస్టమ్ వంటి ఫీచర్లను రూపొందిస్తున్నారు. మెయిల్, ఎక్స్ప్రెస్ రైళ్ల కంటే ఈ రైలు వేగం ఎక్కువగా ఉండటంతోపాటు తక్కువ స్టాపుల్లోనే ఆగనుంది. వందే సాధారణ్ తయారీకి ఒక్కో రైలుకు రూ.100 కోట్లు అవుతున్నట్లు అంచనా.
-
IPL 2026: మలుపు తిప్పిన రనౌట్.. కేకేఆర్ను చిత్తు చేసిన సన్రైజర్స్! -
రైతు భరోసా రెండో విడత నిధుల జమ షెడ్యూల్ ఖరారు, ఈ సారి వీరికే..!! -
Tamil Nadu Survey: తమిళనాడులో మారిపోయిన లెక్కలు-తాజా సర్వేలో ఓటర్ల షాక్..! -
ఇందిరమ్మ లబ్దిదారులకు గుడ్ న్యూస్.. రెండో విడత ఇళ్లపై కీలక ప్రకటన -
ఈ సారి 'తల్లికి వందనం' అమలు అప్పుడే - చంద్రబాబు కీలక ప్రకటన..!! -
బంగారం ధరలకు గత వైభవం -
మెగా డాటర్ మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో.. సంగీత్ శోభన్ "రాకాస" రివ్యూ ! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, అసలు సమస్య - ఇలా చేయండి..!! -
Vijay: ఎంజీఆర్, జయలలిత చేయని సాహసం చేస్తున్న విజయ్? డీఎంకే కంచుకోటలో..! -
చర్లపల్లి నుంచి తెలుగు రాష్ట్రాల మీదుగా ఇక ఈ రైళ్లు ..! -
INS Aridhaman: ప్రళయ కాల రుద్రుడు, నీటి అడుగున భారత్ విశ్వరూపం.. -
బీఆర్ఎస్ లో చేరిక పై తేల్చేసిన జీవన్ రెడ్డి, వాట్ నెక్స్ట్..!!












Click it and Unblock the Notifications