ఆశ్చర్యపరుస్తాం: టిపై వాసిరెడ్డి, 5న టిడిపిలోకి ఆదాల
సీమాంధ్ర గురించి మాట్లాడే అర్హత చంద్రబాబుకు లేదన్నారు. ఎన్నికల అనంతరం థర్డ్ ఫ్రంట్లో తమ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డిదే కీలక పాత్ర అన్నారు. ప్రధానమంత్రి అభ్యర్థిని తామే నిర్ణయిస్తామన్నారు. తెలంగాణలో తమ పార్టీ బలంగా ఉందని ఆమె చెప్పారు.
చంద్రబాబుతో ఆదాల భేటీ
తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడుతో ఆదాల ప్రభాకర్ రెడ్డి భేటీ అయ్యారు. వచ్చే నెల 5న నెల్లూరులో జరగనున్న ప్రజాగర్జన సభలో తాను టిడిపిలో చేరుతానని ఆదాల చెప్పారు. తాను ఎందుకు పార్టీని వీడుతున్నానో ఇప్పటికే చెప్పానన్నారు. తనతో పాటు శ్రీధర్ కృష్ణా రెడ్డి, పొలంరెడ్డి శ్రీనివాస్ రెడ్డిలు కూడా టిడిపిలో చేరే అవకాశముందన్నారు. మరోవైపు గంటా శ్రీనివాస రావు, టిజి వెంకటేష్, ఏరాసు ప్రతాప్ రెడ్డిలు సాయంత్రం 4 గంటలకు సమావేశం కానున్నారు.
బాధాకరమే కానీ.. తోట
మాజీ మంత్రి తోట నరసింహం గురువారం ఉదయం శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ ఉదయం విఐపి బ్రేక్ సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి శ్రీనివాసున్ని దర్శించుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర విభజన బాధాకరమైనప్పటికీ కాంగ్రెస్లోనే కొనసాగుతానన్నారు. కొంతమంది నాయకులు కాంగ్రెస్ను వీడినంత మాత్రాన పార్టీకి వచ్చే నష్టమేమీలేదని తోట నరసింహం అన్నారు.
కిరణ్తో కలిసి పార్టీ: రాయపాటి
కిరణ్ కుమార్ రెడ్డితో కలిసి పార్టీ పెడుతున్నామని గుంటూరు ఎంపి రాయపాటి సాంబశివ రావు చెప్పారు. కిరణ్ పార్టీ మెజార్టీ సాధిస్తుందన్నారు. విభజన ఆపేందుకు ప్రయత్నించామని, కాంగ్రెసు పార్టీ దుర్మార్గంగా వ్యవహరించిందన్నారు.