వరుణ్ తేజ, లావణ్య త్రిపాఠి గురించి వేణుస్వామి ఏం చెప్పారంటే
సినిమా రంగంలోని సెలబ్రిటీల గురించి వేణుస్వామి చెబుతున్న జ్యోతిష్యం కచ్చితంగా జరిగి తీరుతుందనే అభిప్రాయానికి సినీ ప్రేమికులు వచ్చారు. ఎంగేజ్మెంట్ బ్రేక్ అయితేనే రష్మిక తన కెరియర్ లో విజయం సాధిస్తుందని చెప్పారు. ఎంగేజ్మెంట్ బ్రేక్ అయిన తర్వాతే ఆమె పాన్ ఇండియా స్టార్ అయ్యింది. నిధి అగర్వాల్, రష్మిక లాంటివారు ఆయనతో పూజలు చేయించుకొని విజయవంతమయ్యారు. దీంతో ఆ రంగంలో ఉన్నవారిలో వేణుస్వామి చెప్పే విషయాలపై ఇంకా నమ్మకం పెరిగింది.
సమంత, నాగచైతన్య జంట గురించి వాళ్ళు వివాహం చేసుకున్న తర్వాతే విడిపోతారని చెప్పారు. అలాగే ఆ జంట విడిపోయారు. తర్వాత ఒక సినీ నటుడు చనిపోతాడు అని చెప్పడంతో.. ఆయన చెప్పినట్లుగానే హీరో తారకరత్న మృతిచెందడం జరిగింది. వేణుస్వామి ఎవరి గురించైనా చెబితే అది కచ్చితంగా జరిగి తీరుతుందనే అభిప్రాయానికి అందరూ వస్తున్నారు.

ప్రభాస్ సినిమాల గురించి ఆయన చెప్పినట్టుగానే జరిగింది. రామ్ చరణ్ కి పుట్టే పిల్లల గురించి కూడా ఎప్పుడు పుడతారు అనేది చెప్పారు. ఇటీవలే ఆయన హీరో హీరోయిన్స్ ఇద్దరూ వివాహం చేసుకుంటారని చెప్పారు. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో వారెవరబ్బా? అని అందరూ చర్చించుకున్నారు. అందుకు తగ్గట్లుగానే తాజాగా వరుణ్ తేజ్ - లావణ్య త్రిపాఠి పెళ్లి వార్త వచ్చింది.
వీరిద్దరూ కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారని, డేటింగ్ లో ఉన్నారని వార్తలు వచ్చినప్పటికీ బయటకు అధికారికంగా వార్త రాలేదు. జూన్ 9న వాళ్లిద్దరి ఎంగేజ్ మెంట్ అని, పెళ్లిచేసుకోబుతున్నారంటూ ఇంగ్లిష్ మీడియాలో వార్త వచ్చింది. దీంతో వేణుస్వామి చెప్పింది వీరిద్దరి గురించేనని చర్చ జరుగుతోంది.












Click it and Unblock the Notifications