బాబులాంటి వారు వేలమంది వచ్చినా: విజయసాయి తీవ్రవ్యాఖ్యలు, 'బీజేపీలో మార్పు రావాలి'
అమరావతి: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యులు విజయ సాయిరెడ్డి బుధవారం తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు.
చంద్రబాబు నాయుడు అభద్రతా భావంతో ఉన్నారని, ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో ఆయన వైఫల్యం చెందారని విమర్శించారు. కేంద్రంలో భాగస్వామిగా ఉన్న టీడీపీ రాష్ట్రానికి ఏ ఒక్క పనిని చేయించలేకపోయిందన్నారు.

చంద్రబాబు లాంటి వ్యక్తులు వేలమంది వచ్చినా
ఏపీకి ప్రత్యేక హోదా సాధన కోసం తాము అన్ని విధాలా ప్రయత్నిస్తున్నామని విజయసాయి రెడ్డి అన్నారు. చంద్రబాబు లాంటి వ్యక్తులు వేలమంది తమకు ఎదురుపడ్డా భయపడమన్నారు. హోదా సాధించే వరకు ముందుకు సాగుతామన్నారు.

చంద్రబాబుపై తీవ్ర వ్యాఖ్యలు
తనకు ఎంతో రాజకీయ అనుభవం ఉందని చెప్పుకుంటున్న చంద్రబాబుకు క్యారెక్టర్ లేదని, ఊసరవెల్లిలా రంగులు మారుస్తున్నారని, అందుకే, కేంద్ర ప్రభుత్వం, ఇతర రాష్ట్ర ప్రభుత్వాలు చంద్రబాబును నమ్మే పరిస్థితి లేదని విజయ సాయి రెడ్డి అన్నారు.

పోరాటం ఆగదు
కేంద్రంతో లాలూచీ పడటం, ఒప్పందం చేసుకోవడం వంటివి తాము చేయలేదని, తమ ధర్మాన్ని తాము నిర్వర్తిస్తున్నామని విజయ సాయి రెడ్డి అన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా వచ్చే వరకూ తమ పోరాటం ఆగదన్నారు.

బీజేపీలో మార్పు రావాలి
ఏపీతో తమకు పని లేదని, యూపీ ఉందని బీజేపీ అనుకుందని ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ పేర్కొన్నారు. బీజేపీ సొంత నియోజకవర్గంలో ఓడిపోయే పరిస్థితి వచ్చిందన్నారు. ఏపీకి జరిగిన అన్యాయం పొరుగు రాష్ట్రాల ప్రజలకు అర్థమైందని, బీజేపీకి ఈ ఓటమి గుణపాఠమన్నారు. బీజేపీలో మార్పు రావాలన్నారు.
-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!!











Click it and Unblock the Notifications