రామ్గోపాల్ వర్మకు షాక్: కేసు నమోదు చేయాలని కోర్టు ఆదేశం
విజయవాడ: వంగవీటి సినిమాపై ఇంకా వివాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు విజయవాడ కోర్టు స్పందించింది. వంగవీటి సినిమా దర్శకుడు రామ్గోపాల్ వర్మ, నిర్మాత దాసరి కిరణ్లపై కేసు నమోదు చేయాలని విజయవాడ కోర్టు ఆదేశించింది.
వంగవీటి సినిమాపై మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ విజయవాడ ఒకటవ చీఫ్ మెట్రో పాలిటన్ మేజిస్ట్రేట్కు ఫిర్యాదు చేశారు. వంగవీటి సినిమా ద్వారా తమ కుటుంబ గౌరవానికి భంగం కలిగించారని రాధా పిటిషన్ దాఖలు చేశారు.

ఈ ఫిర్యాదు మేరకు దర్శకుడు వర్మ, దాసరి కిరణ్, ఇతరులపై వెంటనే కేసు నమోదు చేసి దర్యాప్తు చేయాలని కోర్టు ఆదేశించింది.ఈ సినిమా విడుదలైన సమయంలోనే సినిమాలో తమ కుటుంబాన్ని తప్పుగా చిత్రీకరించే ప్రయత్నం చేశారని వంగవీటి రాధాకృష్ణ ఆరోపించారు.
ఈ విషయమై సినిమా యూనిట్కు తమ అభ్యంతరాలను వ్యక్తం చేశారు. అంతేకాదు కోర్టును కూడ ఆశ్రయించారు. దీంతో కోర్టు ఈ విషయమై మంగళవారం నాడు స్పందించింది.
-
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత -
ఇరాన్ పై ముప్పేట దాడి- కలిసివచ్చిన ఆరు దేశాలు -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
బడ్జెట్ లో ఉద్యోగులు - మహిళలకు కొత్త వరాలు - పెన్షన్, 'కళ్యాణ లక్ష్మీ' పెంపు ఇలా..!! -
కేబినెట్ లోకి విజయశాంతి, పీసీసీ చీఫ్ మార్పు - ఆ ఇద్దరూ ఔట్..కొత్తగా..!! -
బెంగళూరులో రెండో భారీ ఎయిర్ పోర్ట్ కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
భారీగా పెరిగిన డీజిల్ ధరలు, తగ్గుతున్న నిల్వలు- కొత్త రేట్లు ఇలా..!! -
ఏమి సేతు రా: 2 గంటలు వెయిట్ చేస్తే గానీ అమిత్ షా దొరకలేదు












Click it and Unblock the Notifications