Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

మిథున్ రెడ్డి ఓటుకు బెయిల్ పై ఉత్కంఠ..! తీర్పు రిజర్వ్..!

గత వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిందని ఆరోపిస్తున్న మద్యం కుంభకోణంలో నాలుగో నిందితుడిగా ఉన్న వైసీపీ ఎంపీ మిధున్ రెడ్డికి బెయిల్ లభిస్తుందా లేదా , ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఆయన ఓటు వేస్తారా లేదా అన్న ఉత్కంఠ కొనసాగుతోంది. తనకు ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేసేందుకు వీలుగా మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ మిథున్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ పై విజయవాడ ఏసీబీ కోర్టు వాదనలు పూర్తి తీర్పును రిజర్వ్ చేసింది. అయితే వాదనలు మాత్రం ఆసక్తికరంగా సాగాయి.

వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి మధ్యంతర బెయిల్ పిటిషన్ పై ఏసీబీ కోర్టులో ఇవాళ విచారణ జరిగింది. ఈనెల 9న ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేసేందుకు వీలుగా మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలని మిథున్ రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై ఇరువర్గాల న్యాయవాదులు వాదనలు వినిపించారు. ముందుగా మిథున్ రెడ్డి తరపు న్యాయవాదులు వాదిస్తూ.. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేసేందుకు మాత్రమే మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలని కోరుతున్నట్లు తెలిపారు. కేసును ప్రభావితం చేయడానికి అవకాశాలు ఏమీ లేవన్నారు. మిథున్ రెడ్డి వైసీపీ ఎంపీగా, పార్లమెంట్ లో ఫ్లోర్ లీడర్ గా ఉన్నారని గుర్తుచేశారు.

Vijayawada Court Reserves Order on YSRCP MP Mithun Reddy s Plea to Cast Vote in VP Election

ఉపరాష్ట్రపతి ఎన్నికల కోసం ఆ పార్టీ ఎంపీలను లీడ్ చేయాల్సిన బాధ్యత మిథున్ రెడ్డికి ఉందన్నారు. కాబట్టి ఓటింగ్ ప్రక్రియ, ఎన్నిక ప్రక్రియ మొత్తం పూర్తి అయ్యే వరకు మిథున్ రెడ్డి కి మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలని కోరారు. ఎన్నిక ప్రక్రియ పూర్తయిన అనంతరం కోర్టు ఆదేశాలతో తిరిగి మిధున్ సరెండర్ అవుతారని తెలిపారు. పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకోవడానికి ఇది సాధారణంగా జరిగే ఎన్నిక ప్రక్రియ కాదన్నారు. ఆరోపణలు రావడం, కేసు నమోదు కావడంతో ఆయనే స్వచ్చంధంగా లొంగిపోయారని లాయర్లు తెలిపారు. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో మిథున్ రెడ్డి పాల్గొనకుండా సెట్.. కోర్టును తప్పుదారి పట్టిస్తుందన్నారు. అమృత్ పాల్ సింగ్ కేసులో ఇచ్చిన జడ్జిమెంట్ మిథున్ రెడ్డి కేసులో వర్తించదన్నారు.

Vijayawada Court Reserves Order on YSRCP MP Mithun Reddy s Plea to Cast Vote in VP Election

దీనికి స్పందనంగా సిట్ తరపు న్యాయవాది..మిథున్ రెడ్డికి మధ్యంతర బెయిల్ మంజూరు చేయొద్దని కోరారు. కేసును ప్రభావితం చేసే అవకాశం ఉందన్నారు. అమృత్ పాల్ సింగ్ కేసులో కేంద్ర ఎన్నికల సంఘం పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకోవాలని చెప్పిందని గుర్తుచేశారు. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో అమృత్ పాల్ సింగ్ పోస్టల్ బ్యాలెట్ ను ఉపయోగించుకున్నారని కోర్టుకు తెలిపారు. దీంతో కోర్టు వాదనలు ముగించి తీర్పును రిజర్వ్ చేసింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+