క్రైసిస్లో కనిపించకపోతే ఎలా- ఆయనకు ఇచ్చి పడేసిన పూనమ్ కౌర్
Vijayawada floods 2024: బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో ఏపీలో నిన్నటివరకు భారీ వర్షాలు దంచికొట్టాయి. కోస్తా తీర ప్రాంత జిల్లాలను ముంచివేశాయి. ప్రత్యేకించి- రాజధాని అమరావతి సహా ఎన్టీఆర్, గుంటూరు జిల్లాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి.
ఎగువ పరీవాహక ప్రాంతాల్లో కురిసిన వర్షాల వల్ల కృష్ణానది ఉగ్రరూపాన్ని ధరించింది. వరద నీటితో పోటెత్తింది. బుడమేరుకు వరద ప్రవాహం కొనసాగుతూనే ఉంది. విజయవాడ, అమరావతి ప్రాంతాలు ఇంకా నీటిలోనే నానుతున్నాయి. సింగ్నగర్, చిట్టినగర్, సితార, రాజరాజేశ్వరి పేట, యనమలకుదురు, జక్కంపూడి వంటి ప్రాంతాలవాసులు వరద నీటిలో కాలం వెళ్లదీస్తోన్నారు.

ప్రస్తుతం ఏపీ ప్రభుత్వం మొత్తం విజయవాడ, గుంటూరుల్లో మకాం వేసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా రెండు రోజులుగా ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఉంటోన్నారు. వరద తీవ్రతను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తోన్నారు. అర్ధరాత్రిళ్లు కూడా ఆయన సమీక్షా సమావేశాలను నిర్వహిస్తోన్నారు.
కొల్లు రవీంద్ర, పొంగూరు నారాయణ.. ఇలా దాదాపుగా మంత్రులందరూ రోడ్ల మీదే ఉంటోన్నారు. హోం, విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి వంగలపూడి అనిత సైతం వరద బాధితుల సహాయ కార్యక్రమాల్లో పాల్గొంటోన్నారు. ప్రకాశం బ్యారేజీ ఇన్ఫ్లో, అవుట్ ఫ్లో సహా భారీ వర్షాలపై విపత్తుల నిర్వహణ విభాగం కార్యాలయంలో సమీక్షలను నిర్వహిస్తోన్నారు.
అందరూ ఉన్నప్పటికీ- ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ మాత్రం అందుబాటులో ఉండకపోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. విజయవాడలో వరద సంభవించి మూడు రోజులు అవుతున్నప్పటికీ ఆయన జాడ కనిపించట్లేదు. సెప్టెంబర్ 2వ తేదీ రాత్రి కొన్ని వరుస ట్వీట్లు పెట్టారంతే.
Silence and absence of politicians during time of crisis is an indicator that they “ don’t walk the talk” but are just extremely self centred and opportunistic.
— पूनम कौर ❤️ poonam kaur (@poonamkaurlal) September 3, 2024
పవన్ కల్యాణ్ కనిపించకపోయిన ప్రస్తుత పరిస్థితుల్లో ప్రముఖ నటి పూనమ్ కౌర్.. తెర మీదికి వచ్చారు. తన అధికారిక ఎక్స్ హ్యాండిల్లో ఘాటు కామెంట్స్ పెట్టారు. సంక్షోభ సమయాల్లో ప్రజలకు అందుబాటులో లేకపోవడం పట్ల తన అభిప్రాయాలను కుండబద్దలు కొట్టారు.
ఇలాంటి సంక్షోభం, ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు రాజకీయ నాయకులు అందుబాటులో ఉండకపోవడం, వాళ్లు కనిపించకపోవడం సరికాదని పేర్కొన్నారు. ఇది ఆ రాజకీయ నాయకుల పచ్చి అవకాశవాదానికి, నిలువెత్తు స్వార్థానికి ప్రతీకగా అభివర్ణించారు. ఆమె చేసిన ఈ పోస్ట్ పవన్ కల్యాణ్ను ఉద్దేశించే అయివుంటుందంటూ రిప్లైలు పెడుతున్నారు నెటిజన్లు.
-
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే!











Click it and Unblock the Notifications