విజయవాడ రైలు ప్రయాణికులకు గమనిక- ఈ రూట్ లో ఇకపై..!!
విజయవాడ డివిజన్ రైలు ప్రయాణికులకు శుభవార్త. చెన్నై సెంట్రల్ మార్గంలో మూడో రైల్వే లైన్ అందుబాటులోకి వచ్చింది. దీంతో ఈ మార్గంలో రైళ్ల రాకపోకలకు ఎటువంటి ఆటంకాలు ఉండబోవు. ఇప్పటివరకు డబ్లింగ్ లో ఉన్న లైన్ ఇది. అత్యంత రద్దీతో కూడుకున్న ఉన్న రూట్ కావడం వల్ల దీన్ని అప్ గ్రేడ్ చేశారు. మూడో రైల్వే లైన్ మార్గాన్ని నిర్మించారు. ఈ ట్రాక్ ను ప్రారంభించినట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు వెల్లడించారు.
దక్షిణ మధ్య రైల్వే తన నెట్వర్క్ సామర్థ్యం పెంపునకు మౌలిక సదుపాయాల కల్పనపై ఇప్పటికే దృష్టి సారించింది. ప్రత్యేక రైళ్లను నడిపించడంతో పాటు కొత్త రైల్వే మార్గాలు, డబ్లింగ్/ట్రిప్లింగ్, ఎలక్ట్రిఫికేషన్ వంటి పనులకు ప్రాధాన్యత ఇస్తోంది. దేశంలోనే అత్యంత ఆదాయం అందుతోన్న జోన్ ఇది. ఉత్తరం- దక్షిణాది రాష్ట్రాలను అనుసంధానం చేసే పలు రద్దీ ట్రాక్ లు దక్షిణ మధ్య రైల్వే జోన్ పరిధిలోకి వస్తాయి.

అందులో ఒకటి.. విజయవాడ- చెన్నై సెంట్రల్. పలు రద్దీ రైళ్లు నిత్యం ఈ మార్గంలో రాకపోకలు సాగిస్తుంటాయి. లక్షలాదిమంది ప్రయాణికులను తమ గమ్యస్థానాలకు చేరవేస్తుంటాయి. ఏపీ తీర ప్రాంతంలో గ్రాండ్ ట్రంక్ రూట్ లో ఉన్న విజయవాడ-గూడూరు సెక్షన్ అత్యంత కీలకం. ఉత్తర, తూర్పు రాష్ట్రాలను దక్షిణాదిని కనెక్ట్ చేయడంలో వ్యూహాత్మక పాత్ర పోషిస్తోంది. ప్రయాణికులు, గూడ్స్ రైళ్ల రద్దీ పెరగడంతో ఈ మార్గం తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటోంది.
దీన్ని తగ్గించాలనే ఉద్దేఁశంతో 2015-16లో విజయవాడ-గూడూరు మూడో లైన్ ప్రాజెక్టు మంజూరైంది. 288 కిలోమీటర్ల పొడవు గల ప్రాజెక్ట్ ఇది. సుమారు రూ. 3,246 కోట్ల వ్యయంతో రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ ఈ పనులు చేపట్టింది. ఇందులో భాగంగా బాపట్ల-చుండూరు మధ్య 32 కిలోమీటర్ల రైల్వే సెక్షన్ను ఇదివరకే విజయవంతంగా పూర్తి చేసింది. విజయవాడ-గూడూరు ట్రిప్లింగ్, విద్యుదీకరణ ప్రాజెక్టులో భాగం ఇది.
సూర్యారెడ్డిపాలెం-చుండూరు మధ్య ఇప్పటికే 106 కిలోమీటర్ల దూరం నిరంతరాయంగా మూడో లైన్, విద్యుదీకరణ సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. గూడూరు-సింగరాయకొండ (127 కి.మీ), బాపట్ల-సూర్యారెడ్డిపాలెం (74 కి.మీ), బాపట్ల-చుండూరు (32 కి.మీ) ఇలా దశలవారీగా ట్రిప్లింగ్ పనులను ఏకకాలంలో చేపట్టింది. తాజాగా 281 కిలోమీటర్ల మేర విజయవాడ- గూడూరు సెక్షన్ లో మూడో లైన్ ప్రారంభించామని, ఇది అందుబాటులోకి వచ్చిందని అధికారులు వెల్లడించారు.
-
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..!












Click it and Unblock the Notifications