విశాఖ లవర్ హత్య .. ఆన్లైన్లో కత్తులు, రక్తపు వాసన రాకుండా సెంట్ కొట్టి.. భయానకం!
విశాఖపట్నం మౌనిక హత్య కేసులో ఒళ్ళు గగుర్పొడిచే విషయాలు బయటకు వస్తున్నాయి. పోలీసులు జరుపుతున్న ప్రాథమిక దర్యాప్తులో నిందితుడు రవీంద్ర, మౌనిక పరిచయం హత్యకు దారి తీసిన పరిస్థితులపై కీలక వివరాలు వెల్లడయ్యాయి. నేవీ ఉద్యోగిగా పనిచేస్తున్న రవీంద్ర 2020 లాక్డౌన్ సమయంలో డేటింగ్ యాప్ ద్వారా మౌనిక తో పరిచయాన్ని ఏర్పరచుకున్నాడు. వారిద్దరి మధ్య ప్రేమ సంబంధం మూడేళ్లపాటు కొనసాగింది.
మౌనికను చంపింది ఇందుకే.. పోలీసులతో నేవీ ఉద్యోగి
2023లో వారిద్దరు విడిపోయారు. ఆ తర్వాత రవీంద్ర మరొక యువతిని వివాహం చేసుకున్నాడు. పెళ్లి చేసుకున్న తర్వాత రవీంద్ర సంవత్సరం క్రితం ఎల్బీనగర్లోని అపార్ట్మెంట్ కు మకాం మార్చాడు. నాలుగు నెలల క్రితం అతని భార్య ప్రసవం కోసం పుట్టింటికి వెళ్ళింది. అయితే ఈ సమయంలో మౌనిక డబ్బుల కోసం రవీంద్రను వేధించడం మొదలు పెట్టింది. డబ్బుల కోసం వేధింపులు కొనసాగిస్తున్న కారణంగా మౌనికను హతమార్చినట్టు రవీంద్ర పోలీసులకు వెల్లడించారు.

ఆన్ లైన్లో కత్తి ఆర్డర్.. హత్య తర్వాత రక్తం వాసన రాకుండా సెంట్
మార్చి 29వ తేదీ మధ్యాహ్నం ఒంటిగంటకు మౌనికను తన ఎల్బీనగర్లోని అపార్ట్మెంట్ కు పిలిచిన రవీంద్ర ఆమెతో తీవ్ర వాగ్వాదానికి దిగాడు. ఆ తర్వాత ఆమెను దారుణంగా హతమార్చాడు. ముందే ఆమెను హతమార్చాలని ప్లాన్ చేసుకున్న రవీంద్ర డీమార్ట్ లో కత్తులు దొరకకపోవడంతో ఆన్లైన్లో ఆర్డర్ చేసి కత్తి తెప్పించుకున్నాడు. హత్య తర్వాత ఇంట్లో రక్తం మరకలను శుభ్రం చేసి సెంట్ చల్లాడు.
ఫ్రిజ్ లో కొన్ని శరీర భాగాలు, మంచం క్రింద గోనెసంచిలో కొన్ని
మౌనిక శరీర భాగాలను ముక్కలుగా చేసి కొన్నింటిని ఫ్రిజ్లో పెట్టాడు, మిగిలినవి గోనెసంచిలో మంచం కింద దాచి పెట్టాడు. మౌనిక తల, చెప్పులు, సిమ్ కార్డులు ఒక సూట్ కేసులో తీసుకువెళ్లి దార పాలెం తోటల దగ్గర కాల్చేశాడు. ఆ తర్వాత స్నేహితుడికి హత్య విషయం చెప్పాడు. దీంతో అతను సలహా మేరకు రవీంద్ర గాజువాక పోలీసుల ముందు లొంగిపోయాడు.
రవీంద్ర చెప్పిన దానికి భిన్నంగా మౌనిక తండ్రి వాదన
అయితే రవీంద్ర డబ్బుల కోసమే హత్య చేశాడని చెబుతున్న వాదనకు భిన్నంగా మౌనిక కుటుంబ సభ్యుల వాదన ఉంది. మార్చి 29వ తేదీ ఉదయం 10 గంటల 30 నిమిషాలకు మౌనిక ఒక ఈవెంట్ కు వెళుతున్నాను అని చెప్పి వెళ్లిందని ఆ తర్వాత మౌనిక ఫోన్ స్విచాఫ్ వచ్చిందని, ఈవెంట్ బిజీలో ఉండడం వల్ల ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఉంటుందని తమ భావించినట్లుగా తండ్రి వేణుగోపాల్ తెలిపారు.
రవీంద్ర ఎవరో కూడా తమకు తెలీదన్న తల్లిదండ్రులు
రాత్రి ఇంటికి రాకపోవడంతో ఎక్కడెక్కడో వెతికాం అన్నారు. శుక్రవారం ఉదయం హత్య విషయం తెలిసిందని ఆయన అసలు రవీంద్ర ఎవరో కూడా తమకు తెలియదన్నారు. మౌనిక కు ఎవరితోనూ ఎటువంటి ప్రేమ వ్యవహారాలు లేవని ఆయన పేర్కొన్నారు. అయితే ఈ కేసులో పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.
-
విశాఖ-ఢిల్లీ ఇండిగో ఫ్లైట్ లో తీవ్ర సాంకేతిక లోపం -
విశాఖలో వాహనదారులకు హెచ్చరిక .. ఆ పని చేస్తే ఇక కష్టమే -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
టీవీకే అభ్యర్థుల జాబితా విడుదల వేళ.. త్రిష ప్రీ- ప్లాన్డ్ గా !! -
రామ్చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్తో ఛాన్స్ కొట్టేసింది! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఏప్రిల్ 1 నుంచి ఉద్యోగులకు కొత్త రూల్స్- జీతం, పన్ను సహా భారీ మార్పులు..! -
ఇరాన్కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్.. -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!!













Click it and Unblock the Notifications