ఆనందం కాస్త ప్రమాదంగా: తెగిపడిన కైలాసగిరి రోప్వే (ఫోటోలు)
అమరావతి: విశాఖపట్నంలోని కైలాసగిరి రోప్ వేలో ఆదివారం సాయంత్రం ప్రమాదం చోటు చేసుకుంది. కైలాసగిరిపై రోప్ వే నుంచి కొక్కెం ఊడిపోవడంతో కేబుల్ కారు తెగిపడింది. ఈ ప్రమాదంలో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి.
వివరాల్లోకి వెళితే ఆదివారం కైలాసగిరిపై ఆనందంగా గడపడానికి సికింద్రాబాద్ నుంచి ఒకే కుటుంబం వచ్చింది. సాయంత్రం 4 గంటల సమయంలో వీరు కొండపై నుంచి కిందకు దిగేందుకు రోప్ వే వద్దకు వెళ్లి కేబుల్ కారు ఎక్కారు.
రోప్ వే స్టేషన్ దాటిన వెంటనే కేబుర్ కారుకు ఉన్న కొక్కెం ఒక్కసారిగా ఊడిపోయింది. దీంతో కేబుల్ కారు తెగిపడి కొండపై ఉన్న చెట్ల మధ్యలో ఇది చిక్కుకుపోవడంతో పెనుప్రమాదం తప్పింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురికి స్వల్పగాయాలయ్యాయి.
వీరిలో ఇద్దరు చిన్నారులు ఉన్నారు. అయితే ఎవరికీ ప్రాణపాయం లేదంటున్నారు. ఒక్కసారిగా కేబుల్ కారు కొక్కెం తెగిపోవడంతో సందర్శకులంతా ఒక్కసారి భయాందోళనకు గురయ్యారు. వెంటనే అప్రమత్తమయిన నిర్వాహకులు వెనుక వస్తున్న కేబుల్కార్లను వెంటనే నిలిపివేయడంతో పెనుప్రమాదం తప్పింది.
ప్రమాదానికి గురైన కేబుల్ కారు ప్రారంభమై వెంటనే ఘటన జరగడంతో ప్రాణనష్టం జరగలేదు. కొద్ది దూరం ప్రయాణించిన తర్వాత జరిగినట్టయితే ప్రాణనష్టం జరిగి ఉండేదని స్థానికులు తెలిపారు. సమాచారం అందుకున్న ఆరిలోవ పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు.
ఈ ప్రమాదంలో గాయపడిన వారిని విశాఖ కేజీహెచ్కు తరలించారు. అక్కడ ప్రథమ చికిత్స అయిన వెంటనే కేర్ ఆసుపత్రికి తీసుకుని వెళ్లినట్టు పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదంలో గాయపడిన వారిని ఈ అలేఖ్య (24), ఆశిష్కుమార్(38), ఆర్.మనీషా(19), సుజన(33), యాచిక సాగర్(6), షియాకొండల్(6)గా గుర్తించారు.

ఆనందం కాస్త ప్రమాదంగా: తెగిపడిన కైలాసగిరి రోప్వే
విశాఖపట్నంలోని కైలాసగిరి రోప్ వేలో ఆదివారం సాయంత్రం ప్రమాదం చోటు చేసుకుంది. కైలాసగిరిపై రోప్ వే నుంచి కొక్కెం ఊడిపోవడంతో కేబుల్ కారు తెగిపడింది. ఈ ప్రమాదంలో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి.

ఆనందం కాస్త ప్రమాదంగా: తెగిపడిన కైలాసగిరి రోప్వే
వివరాల్లోకి వెళితే ఆదివారం కైలాసగిరిపై ఆనందంగా గడపడానికి సికింద్రాబాద్ నుంచి ఒకే కుటుంబం వచ్చింది. సాయంత్రం 4 గంటల సమయంలో వీరు కొండపై నుంచి కిందకు దిగేందుకు రోప్ వే వద్దకు వెళ్లి కేబుల్ కారు ఎక్కారు.

ఆనందం కాస్త ప్రమాదంగా: తెగిపడిన కైలాసగిరి రోప్వే
రోప్ వే స్టేషన్ దాటిన వెంటనే కేబుర్ కారుకు ఉన్న కొక్కెం ఒక్కసారిగా ఊడిపోయింది. దీంతో కేబుల్ కారు తెగిపడి కొండపై ఉన్న చెట్ల మధ్యలో ఇది చిక్కుకుపోవడంతో పెనుప్రమాదం తప్పింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురికి స్వల్పగాయాలయ్యాయి.

ఆనందం కాస్త ప్రమాదంగా: తెగిపడిన కైలాసగిరి రోప్వే
వీరిలో ఇద్దరు చిన్నారులు ఉన్నారు. అయితే ఎవరికీ ప్రాణపాయం లేదంటున్నారు. ఒక్కసారిగా కేబుల్ కారు కొక్కెం తెగిపోవడంతో సందర్శకులంతా ఒక్కసారి భయాందోళనకు గురయ్యారు.

ఆనందం కాస్త ప్రమాదంగా: తెగిపడిన కైలాసగిరి రోప్వే
వెంటనే అప్రమత్తమయిన నిర్వాహకులు వెనుక వస్తున్న కేబుల్కార్లను వెంటనే నిలిపివేయడంతో పెనుప్రమాదం తప్పింది.

ఆనందం కాస్త ప్రమాదంగా: తెగిపడిన కైలాసగిరి రోప్వే
ప్రమాదానికి గురైన కేబుల్ కారు ప్రారంభమై వెంటనే ఘటన జరగడంతో ప్రాణనష్టం జరగలేదు. కొద్ది దూరం ప్రయాణించిన తర్వాత జరిగినట్టయితే ప్రాణనష్టం జరిగి ఉండేదని స్థానికులు తెలిపారు.

ఆనందం కాస్త ప్రమాదంగా: తెగిపడిన కైలాసగిరి రోప్వే
సమాచారం అందుకున్న ఆరిలోవ పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ ప్రమాదంలో గాయపడిన వారిని విశాఖ కేజీహెచ్కు తరలించారు.

ఆనందం కాస్త ప్రమాదంగా: తెగిపడిన కైలాసగిరి రోప్వే
అక్కడ ప్రథమ చికిత్స అయిన వెంటనే కేర్ ఆసుపత్రికి తీసుకుని వెళ్లినట్టు పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదంలో గాయపడిన వారిని ఈ అలేఖ్య (24), ఆశిష్కుమార్(38), ఆర్.మనీషా(19), సుజన(33), యాచిక సాగర్(6), షియాకొండల్(6)గా గుర్తించారు.












Click it and Unblock the Notifications