అనంతపురం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వోల్వో బస్సు బోల్తా: ఏపీలో తెరాస సభ్యులకు గాయాలు

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్/అనంతపురం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపురం జిల్లాలో... తెలంగాణ రాష్ట్రానికి చెందిన పలువురు తెలంగాణ రాష్ట్ర సమితి ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు ప్రయాణిస్తున్న వోల్వో బస్సు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో పలువురు స్వల్పంగా గాయపడ్డారు.

అనంతపురం జిల్లా పెద్దవడుగూరు మండలం కాశేపల్లి సమీపంలో 44వ జాతీయ రహదారి పైన మంగళవారం ఉదయం హైదరాబాదు నుండి బెంగళూరు వెళ్తున్న ప్రయివేటు ట్రావెల్స్‌కు చెందిన వోల్వో బస్సు బోల్తా పడింది. ప్రమాదంలో ఆరుగురికి గాయాలయ్యాయి.

Volvo accident: TRs leaders injured

ఈ నెల 4వ తేదీన మండల పరిషత్ అధ్యక్షుల ఎన్నిక జరగనున్న నేపథ్యంలో తెలంగాణ ప్రాంతానికి చెందిన తెరాస ఎంపీటీసీ సభ్యుల బృందం బెంగళూరు విహార యాత్రకు వెళ్తున్న సందర్భంగా బస్సు అదుపు తప్పి బోల్తాపడి ఈ ప్రమాదం జరిగింది. క్షతగాత్రులను గుత్తి ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ సభ్యులు నల్గొండ జిల్లాకు చెందిన వారిగా తెలుస్తోంది.

English summary
Volvo accident: TRs leaders injured in Anantapuram district.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X