వోల్వో బస్సులో మంటలు, దగ్ధం: రైలులో భారీ దోపిడీ

అగ్నిమాపక సిబ్బందికి ఫోన్ చేశాడు. అగ్నిమాపక సిబ్బంది మంటలార్పుతున్నారు. ప్రమాదంలో బస్సు పూర్తిగా కాలిపోయింది. షార్ట్ సర్య్కూట్ వల్లే ఈ ఘటన జరిగి ఉంటుందని భావిస్తున్నారు. బస్సులో 41 మంది ప్రయాణీకులు ఉన్నారు. అందరు సురక్షితంగా ఉన్నారు. కరీంనగర్ నుంచి హైదరాబాదు వెళుతుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ప్రయాణీకుల ల్యాప్టాప్లు, ఇతర సామాగ్రి దగ్ధమయ్యాయి.
రైలు దోపిడీ
గుంటూరు జిల్లా పిడుగురాళ్ళ సమీపంలోని తుమ్మల చెరువు వద్ద చెన్నై నుంచి హైదరాబాద్ వస్తున్న ఓ ఎక్స్ప్రెస్ రైలులో భారీ దోపిడీ జరిగింది. ఈ ఘటన ఈ రోజు తెల్లవారుజామున 2.10గంటల సమయంలో జరిగింది. రైల్లో ప్రయాణిస్తున్న సుమారు 10 మంది దుండగులు తుమ్మలచెరువు వద్ద చైన్ లాగి రైలుని నిలిపి వేశారు.
అనంతరం దుండగులు రైల్లో నుంచి దిగి కిటికీ పక్కన ఉన్న ప్రయాణికుల నుంచి భారీ మొత్తంలో బంగారం, నగదు దోచుకున్నారు. ఎస్-5, ఎస్-9, ఎస్-11, ఎస్-12 బోగీలలో ఈ దోపిడీ జరిగింది. దీంతో రైలు అరగంటకు పైగా నిలిచిపోయింది. రైలు సికింద్రాబాద్ చేరుకున్న అనంతరం దోపిడీకి గురైన ప్రయాణికులు రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశారు. రైల్వే పోలీసులు దోపిడీకి గురైన ప్రదేశాన్ని పరిశీలించారు.
-
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
భారతీయులకు భారీ శుభవార్త.. హెచ్-1బీ ఆంక్షలు ఎత్తివేత..?? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
తెలంగాణా రైతులకు కేంద్రం తీపికబురు! -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !!












Click it and Unblock the Notifications