వోల్వో: జెసి అరెస్ట్ కోసం ధర్నా, కేజ్రీవాల్ పార్టీ సపోర్ట్
హైదరాబాద్: అక్టోబర్ 30వ తేదిన జరిగిన మహబూబ్ నగర్ జిల్లా పాలెం బస్సు ప్రమాద బాధితులు శుక్రవారం హైదరాబాదులోని ఇందిరా పార్కు వద్ద ఆరని మంటలు పేరుతో దీక్షకు దిగారు. ప్రమాదానికి గురైన బస్సు యజమాని జెసి ప్రభాకర్ రెడ్డిని వెంటనే అరెస్టు చేయాలని బాధిత కుటుంబ సభ్యులు డిమాండ్ చేశాయి. ఈ ధర్నాలో ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన కార్యకర్తలు కూడా పాల్గొని బాధితులకు అండగా నిలబడ్డారు.
కాగా, అక్టోబర్ 30వ తేదీన మహబూబ్ నగర్ జిల్లా కొత్తకోట మండలం పాలెం సమీపంలో జాతీయ రహదారి పైన జరిగిన వోల్వో బస్సు ప్రమాదం ఘటనలో 45 మంది మృత్యువాత పడ్డ విషయం తెలిసిందే. దీనిని ప్రభుత్వం సిఐడి విచారణకు అప్పగించింది.

బస్సులో సజీవ దహనమైన వారు మంటలు అంటుకున్న రెండు నిమిషాల్లోనే మరణించినట్లుగా క్లూస్ టీం నిర్ధారించింది. మంటలు వ్యాపించిన క్షణాల్లోనే కార్పన్ మోనాక్సైడ్, కార్బన్ డై ఆక్సైడ్ పెద్ద ఎత్తున ఉత్పత్తయ్యాయి.

దీంతో గాఢనిద్రలో ఉన్న ప్రయాణీకులు మేల్కొనేసరికి ఆ రెండు వాయువులు బస్సు అంతటా వ్యాపించాయి. దీంతో వారు ఊపిరాడక అపస్మారక స్థితిలోకి చేరుకున్నారు. బస్సులోకి ఆక్సిజన్ అందలేదు. ఆ స్థితిలో ఎవరైనా ఒకటి రెండు నిమిషాల కంటే ఎక్కువ సేపు బతకడం అసాధ్యమని, అద్దాలు పగులగొట్టి ఉంటే ఆక్సిజన్ సరఫరా జరిగి చాలామంది బతికే వారని, ఆ అవకాశం లేకపోవడంతో మంటలు తీవ్రత పెరగకముందే అంతా మృత్యువాత పడ్డారు.
-
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఆ బిల్లులకు ఆమోదం












Click it and Unblock the Notifications