వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బాబు తొలి సంతకంపై అంబటి, కోటి అడిగిన జగన్‌పై తోట

By Srinivas
|
Google Oneindia TeluguNews

War of Words between YSRCP and TDP
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పైన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేత అంబటి రాంబాబు ఆదివారం ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతు రుణమాఫీపై తొలి సంతకం చేసి, కమిటీల పేరుతో చంద్రబాబు కాలయాపన చేస్తున్నారని ఆయన ఆరోపించారు.

తొలి సంతకం పవిత్రతను, విశ్వసనీయతను చంద్రబాబు నాయుడు మంటగలిపారన్నారు. తొలి సంతకం అంటే మరుక్షణం నుంచి అమల్లోకి రావాలన్నారు. చంద్రబాబుకు ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా ఇచ్చిన మాటను నిలుపుకోవాలన్నారు.

జగన్ దోచుకున్నది ఇస్తే: తోట

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి పైన ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు నిప్పులు చెరిగారు. ప్రజల మరణాలను కూడా రాజకీయం చేసే దుస్థితికి జగన్ చేరుకున్నారన్నారు.

జగన్ చెప్పినట్లుగా కోటీ రూపాయల పెద్ద మొత్తంలో నష్ట పరిహారం ఇవ్వడం సాధ్యమేనా? అని ప్రశ్నించారు. తాను దోచుకున్న అవినీతి డబ్బులో నుంచి కోటి రూపాయల చొప్పున ఆయన నష్ట పరిహారం ఇస్తే అందరూ సంతోషిస్తారని ఎద్దేవా చేశారు. కాగా, గెయిల్ బాధితులకు కోటి రూపాయల చొప్పున ఇవ్వాలని జగన్ డిమాండ్ చేసిన విషయం తెలిసిందే.

English summary
War of Words between YSR Congress and Telugudesam Party.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X