అప్రమత్తమైన జనసేన.. హడావుడిగా పిలిపించి: జగన్-పవన్లతో భేటీపై అసలు అలీ ఏం చెప్పారు?
Recommended Video

విజయవాడ: ఈ నెల 9వ తేదీన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరుతారని ప్రచారం జరుగుతున్న టాలీవుడ్ కమెడియన్ అలీ ఆసక్తికరంగా ఆదివారం నాడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ను కలిశారు. ఓ వైపు ఆయన వైసీపీలో చేరుతారని అంతకుముందు మీడియా ప్రతినిధులతో ప్రత్యేకంగా చెప్పినట్లుగా వార్తలు వస్తున్నాయి.
అదే సమయంలో ఇప్పుడు జనసేనానిని కలవడం ఆసక్తిని రేపుతోంది. పవన్ కళ్యాణ్ను కలవడంపై తనను కలిసిన మీడియా ప్రతినిధులతో అలీ స్పందించారు. ఈ సమాధానంతో ఆయన పవన్ కళ్యాణ్కు అండగా జనసేనలో ఉంటున్నారా లేక వైసీపీలోకి నిజంగానే వెళ్తున్నారా అర్థం కాని పరిస్థితి ఏర్పడింది.

అందుకే పవన్ కళ్యాణ్ను కలిశా
కొత్త సంవత్సరం (2019) వచ్చాక పవన్ కళ్యాణ్ను కలవలేదని, అందుకే కలిసేందుకు వచ్చానని కమెడియన్ అలీ తనను సంప్రదించిన మీడియాకు చెప్పారు. నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపేందుకే పవన్ను కలిశానని చెప్పారు. జనసేనానిని మర్యాదపూర్వకంగానే కలిశానని, ఎలాంటి రహస్యం లేదని తేల్చి చెప్పారు. కలవడానికి ప్రాధాన్యత లేదన్నారు. జగన్తో భేటీపై ఇటీవల తనను కలిసిన మీడియా ప్రతినిధులతో అలీ మాట్లాడుతూ.. రెండు రోజుల్లో అన్నీ చెబుతానని అన్నారని తెలుస్తోంది.

అలీ అలా చెప్పినప్పటికీ
ఇప్పుడు పవన్ కళ్యాణ్తో భేటీకి నూతన సంవత్సర శుభాకాంక్షలు అని చెప్పేందుకేనని, సీక్రెట్ లేదని అలీ చెప్పినప్పటికీ.. తాను వైసీపీలో చేరడం లేదని, అవసరమైతే జనసేనలో చేరుతానని చెప్పినట్లుగా భావిస్తున్నారు. దాదాపు రెండు గంటల పాటు భేటీ కావడంతో రాజకీయపరమైన చర్చ జరిగిందని అంటున్నారు. అలీ అభిమానులు కూడా.. ఆయన జనసేనానితోనే ఉంటారని చెబుతున్నారట. కానీ అలీని మాత్రం మీడియా సంప్రదించగా... కొత్త సంవత్సరం కారణంగానే కలిశానని చెప్పారు.

ఇద్దరు మంచి స్నేహితులు
పవన్ కళ్యాణ్కు అలీ మంచి స్నేహితులు. పవన్ ప్రతి సినిమాలో అలీ ఉంటారు. వారి మధ్య ఎంతో స్నేహం ఉంది. ఈ విషయం టాలీవుడ్తో పాటు అభిమానులకు, సాధారణ ప్రజలకు కూడా తెలుసు. అలాంటి అలీ వైసీపీలో చేరడంపై చర్చకు దారి తీసింది.

వైసీపీలోకి వెళ్తానని చెప్పి
పవన్ కళ్యాణ్ను కలవకముందు, తాను వైసీపీలో చేరుతాననే ప్రచారంపై తనను సంప్రదించిన మీడియా ప్రతినిధులతో అలీ మాట్లాడుతూ.. ఈ నెల 9న జగన్ సమక్షంలో వైసీపీలో చేరుతున్నానని, ఆ పార్టీ సీటు ఇచ్చినా ఇవ్వకపోయినా వైసీపీకి పని చేస్తానని చెప్పారట. అలా చెప్పి, ఇప్పుడు జనసేనానిని కలవడం రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది.

జనసేన అప్రమత్తమైందా, ఏం జరుగుతుంది?
పవన్ కళ్యాణ్కు ఎంతో సన్నిహితంగా ఉండే అలీ వైసీపీలో చేరుతారనే ప్రచారం జరగడంతో జనసేన అప్రమత్తమైనట్లుగా చెబుతున్నారు. అలీ శనివారం భీమవరంలో ఓ కార్యక్రమంలో ఉండగా.. జనసేన పార్టీ నేత ముత్తంశెట్టి కృష్ణారావు ఆయనను హడావుడిగా పిలిపించారట. ఆ తర్వాత ఆదివారం ఉదయం పవన్ కళ్యాణ్ నుంచి పిలుపు వచ్చిందని చెప్పి, అలీని జనసేనాని వద్దకు తీసుకు వెళ్లారని తెలుస్తోంది. పవన్ సన్నిహితుడే వైసీపీలో చేరితో జనాల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయని జనసేన అప్రమత్తమైనట్లుగా చెబుతున్నారు.
-
ఇంటింటికీ గంగమ్మ: డ్వాక్రా మహిళలకు కీలక బాధ్యతలు -
గుండెపై "నాగబాబు" పేరు టాటూగా వేసుకున్న టీడీపీ హార్డ్ కోర్ ఫ్యాన్ !! -
రాజకీయ దురంధురుడు చంద్రబాబు: స్టీల్ ప్లాంట్ భూమిపూజలో పవన్ కళ్యాణ్ కితాబు! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
పవన్ Vs విజయ్, మమత- చంద్రబాబు : ఆ రెండు రాష్ట్రాల్లో మోదీ బిగ్ టాస్క్..!? -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు












Click it and Unblock the Notifications