ఈవీఎంల కోసం తోమ్మిది వేల కోట్లు ఏం చేశారు,: చంద్రబాబు నాయుడు
ఈవీఎమ్ లపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పెద్ద యుద్దమే చేస్తున్నాడు. ఈవీఎం లోపాలను మొదటి నుండి వ్యతిరేకిస్తున్న బాబు తాజగాముంబయిలో సైతం ఇదే వైఖరిని వెల్లడించాడు. కాంగ్రెస్ , ఎన్సీపీ కూటమి ప్రచారానికి ముంబయి వెళ్లిన బాబు,ఈవీఎంల లోపాలపై నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో పాల్గోన్నారు. ఈనేపథ్యంలోనే వీవీప్యాట్ ల స్లిప్ లు లెక్కించేందుకు 6రోజులు పడుతుందనడం హస్యస్పదం అన్నారు. కాగా వీవీప్యాట్ లో ఓటు సుమారు 7 సెకన్ల పాటు కనిపించాలని కాని అది కేవలం 3 సెకన్లు మాత్రమే కనిపిస్తోందని ఆరోపించారు. ప్రపంచదేశాలు బ్యాలెట్ పేపర్ ద్వారనే ఎన్నికలు నిర్వహిస్తున్నాయన్నారు. కాగా లోపాలను సవరించడంలో ఈసీ వైఫల్యం చెందుతుందని అన్నారు.

తోమ్మిది వేల కోట్లు ఏం చేశారు
కాగా వీవీ ప్యాట్ల నిర్వాహణ కోసం 9వేల కోట్ల రుపాయాలు ఖర్చు పెట్టి ఏం చేశారని ఆయన ప్రశ్నించారు. ఈవీఎంలోని ఓట్లు వీవీప్యాట్ స్లిప్ లుసరిగా ఉండాలని అన్నారు. ఏపి ఎన్నికల భాగాంగా ఈవీఎంలలో లోపాలు వస్తే వాటిని సరిచేయడానికి సరైన సిబ్బంది లేరని అన్నారు. ఇక్కడ ఎలక్షన్ సీఈవో కూడ ఓటు వేయడానికి ఇబ్బంది పడ్డారని గుర్తు చేశారు.
కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే , ఈడీ, ఐటి, సిబిఐ వంటి సంస్థలతో దాడులు చేయిస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు.












Click it and Unblock the Notifications