పవన్ పార్టీ విషయంలో ముద్రగడ ఏం చేశారో తెలుసా .. లేఖలో జగన్ కు ఏం చెప్పారంటే
ఏపీలో రాజకీయాలు ఎన్నికలు ముగిసిన తర్వాత కూడా రసవత్తరంగానే మారుతున్నాయి. ఎన్నికలకు ముందు కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ఎవరికి మద్దతు ఇస్తే ఆ పార్టీ విజయం సాధించే అవకాశం ఉంటుందని భావించారు . ఎందుకంటే కాపు సామాజిక వర్గ ఓటు బ్యాంకు ఏపీలో అధికారాన్ని శాసించే స్థాయిలో ఉందని అందరూ భావించారు. అయితే ఎన్నికల సమయంలో తర్జన భర్జన చేసి ఎటూ తేల్చని ముద్రగడ పద్మనాభం ఎన్నికలు ముగిసిన తర్వాత తాజాగా రాసిన లేఖ ఇప్పుడు ఏపీలో హాట్ టాపిక్ గా మారింది.

సీఎం జగన్ కు కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం లేఖ .. పవన్ పార్టీపై కీలక వ్యాఖ్యలు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం లేఖ రాశారు. ఈ లేఖలో పవన్ పార్టీ గురించి ఆయన కీలక వ్యాఖ్య చేశారు . 2019 ఎన్నికల్లో కాపు కులానికి చెందిన పార్టీని కూడా కాదని తమ కులమంతా వైసీపీకే ఓటు వేశారని గుర్తుచేశారు. పరోక్షంగా పవన్ కల్యాణ్ నేతృత్వంలోని జనసేన పార్టీని ఆయన ప్రస్తావించారు. కాపు జాతికి మీ ప్రభుత్వం న్యాయం చేయగలదని నమ్ముతున్నామని ముద్రగడ పేర్కొన్నారు . కాపు కులానికి న్యాయం చేయాలని ముద్రగడ పద్మనాభం ఆ లేఖలో జగన్మోహన్ రెడ్డిని కోరారు. మాజీ సీఎం చంద్రబాబు అసంపూర్ణంగా వదిలేసిన కాపు రిజర్వేషన్ ప్రక్రియను పూర్తి చేయాలని కూడా ఆయన విజ్ఞప్తి చేశారు.
Recommended Video


ఏపీలోని కాపులు వైసీపీకే ఓటు వేశారు.. కాపు రిజర్వేషన్ ప్రక్రియ పూర్తి చెయ్యాలని జగన్ ను కోరిన ముద్రగడ
ఇక ఏపీలోని కాపులు వైసీపీకే ఓటు వేశారనే విషయం గుర్తించి కాపులకు న్యాయం చేయాలని ఆయన ముఖ్యమంత్రిని కోరారు. చంద్రబాబు పూర్తి చేయకుండా వదిలేసిన కాపులకు 5 శాతం రిజర్వేషన్ల ప్రక్రియను పూర్తి చేయాలని సిఎం కు విజ్ఞప్తి చేశారు. ఉన్నత వర్గాల్లోని పేదలకు కేంద్రం ప్రభుత్వం కల్పించిన 10 శాతం రిజర్వేషన్లలో 5 శాతం రిజర్వేషన్లు కాపులకు అమలయ్యేలా చూడాలని తన లేఖలో సిఎం జగన్ ను ముద్రగడ పద్మనాభం కోరారు. తాను లేఖలో రాసిన విషయాలు యదార్థమని నమ్మితేనే కాపు జాతికి ఉపకారం చేయాలని ఆయన అన్నారు.

జనసేనకు కాకుండా వైసీపీకి ఓట్లేశారని లేఖలో పేర్కొన్న ముద్రగడ ..
ఏది ఏమైనా ముద్రగడ కాపు సామాజిక వర్గానికి చెందిన పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని కాదని మరీ కాపులు జగన్ కు పట్టం కట్టారని చెప్పటంపై ఇప్పుడు ఏపీలో చర్చ జరుగుతుంది. పవన్ పార్టీ ఓటమికి ఒక రకంగా ముద్రగడ కారణం అయ్యారని ఒప్పుకున్నారని తాజాగా ఆయన రాసిన బహిరంగ లేఖ వల్ల అర్ధం అవుతుంది. మరి ఈ లేఖ విషయంలో జనసైన్యం ఏ విధంగా స్పందిస్తుంది. ముద్రగడ కాపుల రిజర్వేషన్ కోసం రాసిన ఈ లేఖపై సీఎం జగన్ ఎలా స్పందిస్తారో మరి వేచి చూడాలి .
-
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్!











Click it and Unblock the Notifications