'లోకేష్ను పప్పు అంటే తప్పేంటి?, అతిగా స్పందిస్తే మీకే నష్టం'
సోషల్ మీడియాలో రాహుల్ గాంధీని సైతం పప్పు అంటూ కామెంట్ చేశారని ఉండవల్లి గుర్తు చేశారు. అలాంటప్పుడు లోకేష్ ను పప్పు అంటే తప్పేంటి? అని ప్రశ్నించారు.
రాజమండ్రి: ఏపీ ఐటీ, పంచాయితీరాజ్ శాఖ మంత్రి నారా లోకేష్ తడబడ్డ ప్రతీసారి సోషల్ మీడియాలో వ్యంగ్యాస్త్రాలు వెల్లువెత్తుతున్న సంగతి తెలిసిందే. ఒకరకంగా సోషల్ మీడియాలో ఆయన్ను ఫుట్ బాల్ ఆడుతున్నారు. అయితే తన తప్పులను సరిదిద్దుకోవాల్సింది పోయి.. కక్ష సాధింపు ధోరణితో లోకేష్ చర్యలకు ఆదేశిస్తుండటం ఆయన్ను మరింత విమర్శలపాలు చేస్తుందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
తాజాగా మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ఇదే విషయంపై స్పందించారు. సోషల్ మీడియా పోస్టింగులపై అతిగా స్పందిస్తే.. అది చంద్రబాబు సర్కార్ కే నష్టమని చెప్పారు. సోషల్ మీడియాలో రాహుల్ గాంధీని సైతం పప్పు అంటూ కామెంట్ చేశారని ఉండవల్లి గుర్తు చేశారు. అలాంటప్పుడు లోకేష్ ను పప్పు అంటే తప్పేంటి? అని ప్రశ్నించారు.

ఇక ముందస్తు ఎన్నికల గురించి ప్రస్తావిస్తూ చంద్రబాబు ప్రభుత్వాన్ని ఆయన హెచ్చరించారు. వైసీపీ అధినేత జగన్ అవినీతిపరుడని ముందస్తు ఎన్నికలకు సిద్దపడితే ఓట్లు పడవని సూచించారు. రాష్ట్ర రెవెన్యూ లోటును పూడ్చేందుకు కేంద్రం నుంచి నిధులు తీసుకురావడం, 2018నాటికి పోలవరం ద్వారా నీళ్లివ్వడం వంటి చర్యలు చేపడితేనే టీడీపీకి ఓట్లు పడుతాయని చెప్పుకొచ్చారు.
-
ఏపీలో రైతులకు క్యూఆర్ కోడ్ తో పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ.. చంద్రబాబు తీపికబురు! -
తెలుగులో ఇంత బోల్డ్ కంటెంటా...బాబోయ్ అన్ని ఆ సీన్లే..! -
అలిగిన `స్వీటీ`ని ఇంటికి భోజనానికి పిలిచిన విజయ్- రష్మిక -
ఉగాది నుంచి మీన రాశి, కుంభరాశి వారి జాతక ఫలం -
పీఎం కిసాన్ - అన్నదాత సుఖీభవ నిధుల జమ: ఖాతాల్లో రూ 6 వేలు, తాజా నిర్ణయం..!! -
మోదీ కేబినెట్ లోకి జనసేన, ఏపీలో బీజేపీకి మరో మంత్రి పదవి - ఆయనకే ఛాన్స్..!! -
మందుబాబులకు కిక్ ఇచ్చే కబురు- ఏప్రిల్ 1 నుండి.. -
విజయ్, త్రిష పెళ్లి డేట్ ఫిక్స్.. ఎన్నికలకు ముందే..!! -
T20 World Cup Final: అచ్చిరాని స్టేడియంలో కివీస్ తో ఫైనల్-పిచ్ లో కీలక మార్పు..! -
T20 WC 2026 ఫైనల్ గెలిచేది ఆ జట్టే: మహమ్మద్ అమీర్ -
T20 World Cup: భారత్ కు అదే మైనస్, మాకు ప్లస్-ఫైనల్ పై తేల్చేసిన కివీస్ కెప్టెన్..! -
H1B Visa న్యూ రూల్- గుడ్ న్యూస్











Click it and Unblock the Notifications